Amritpal Singh : నా కొడుకును పంజాబ్‌ జైలుకు తరలించండి..​అమృత్​పాల్ సింగ్ తల్లి అరెస్టు

  • Written By:
  • Publish Date - April 8, 2024 / 11:29 AM IST

Amritpal Singh Mother Arrested : ఖలిస్థానీ(Khalistani) సానుభూతిపరుడు, వారిస్​ పంజాబ్​ దే చీఫ్ అమృత్​పాల్​ సింగ్​ తల్లి బల్వీందర్​ కౌర్‌(Balwinder Kaur)ను పోలీసులు అరెస్టు చేశారు. అసోం(Assam)లోని దిబ్రూగఢ్​ నుంచి పంజాబ్‌(Punjab) జైలుకు అమృత్​పాల్(Amritpal)​ను తరలించాలని డిమాండ్​ చేస్తున్న ఆమెను పంజాబ్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, సోమవారం ఆమె అమృత్​పాల్​తో పాటు అరెస్టైన మరికొంతమంది ఖైదీల కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ర్యాలీ (చేత్నా మార్చ్) చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెతో పాటు అమృత్​పాల్​ మామ, మరికొంతమందిని ఆదివారం అమృత్​సర్​లో అరెస్టు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

‘అమృత్​పాల్​ తల్లి బల్వీందర్​ కౌర్‌ను జ్యుడిషియల్​ కస్టడీకి పంపాం. ఇది కేవలం ముందస్తు అరెస్టు మాత్రమే. బల్వీందర్​తో పాటు సుఖ్‌చైన్ సింగ్‌, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం’ అని డిప్యూటీ కమిషనర్​ ఆఫ్​ పోలీస్​ ఆలం విజయ్​ సింగ్​​ తెలిపారు. కాగా, అరెస్టుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలపడానికి ఆయన నిరాకరించారు.

Read Also: Phone Tapping Den : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గెస్ట్ హౌజ్ నుంచే ‘ఫోన్ ట్యాపింగ్’ !

అమృత్​పాల్​, అతడి మద్దతుదారులకు సంబంధించి జైలు మార్పునకు మద్దతుగా అతడి తల్లితోపాటు ఇతర ఖైదీల కుటుంబీకులు, బంధువులు మార్చి 8న చేత్నా మార్చ్ పేరుతో ర్యాలీ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బఠిండాలోని దామ్‌దామా సాహిబ్​ అకల్​ తఖ్త్​ సాహిబ్‌కు చెందిన జాతేదార్​ నేతృత్వంలో ఈ ర్యాలీ జరగనుండగా పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని అమృత్​పాల్ సింగ్​ తండ్రి మీడియాతో తెలిపారు. పోలీసుల చర్యను తప్పుబడుతూ శిరోమణి అకాలీదళ్​ నాయకులు ఆమ్​ ఆద్మీ పార్టీ ప్రభుత్వ వైఖరిని ఖండించింది.

Read Also: Hyderabad : హత్య చేసి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువకులు

మరోవైపు అమృత్​పాల్​ తల్లి బల్వీందర్​ కౌర్​, అరెస్టైన ఇతర ఖైదీలు కుటుంబీకులతో కలిసి గత ఫిబ్రవరి 22నుంచి అమృత్‌సర్‌లోని గోల్డెన్​ టెంపుల్​ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు. అమృతపాల్‌తో పాటు ఇతర ఖైదీలను పంజాబ్‌లోని జైలుకు తీసుకువచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని ఆమె చెప్పారు. కాగా, అమృతపాల్​ సింగ్​తోపాటు మరో తొమ్మిది మంది మద్దతుదారులను గతేడాది ఏప్రిల్‌లో పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. ప్రస్తుతం వీరంతా అసోంలోని దిబ్రూగఢ్​ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.