Rahul On Train: ఉదయ్ పూర్ రైలెక్కిన రాహుల్ గాంధీ..చింతన్ శిబిర్ కు హాజరు..!!

రాహుల్ గాంధీ ఉదయ్ పూర్ కు పయనమయ్యారు.

  • Written By:
  • Publish Date - May 13, 2022 / 01:53 AM IST

రాహుల్ గాంధీ ఉదయ్ పూర్ కు పయనమయ్యారు. 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మేథోమధనం కోసం చింతన్ శిబిర్ పేరిట నిర్వహిస్తున్న సభకు పార్టీ కీలక నేతలంతా ఉదయ్ పూర్ కు వెళ్లారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన ఆ పార్టీ నేతలంతా కూడా ఉదయ్ పూర్ కు చేరుకున్నారు. తాజాగా గురువారం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు.
ఢిల్లీ నుంచి ఉదయ్ పూర్ చేరుకునేందుకు రాహుల్ గాంధీ రైలు ప్రయాణం ద్వారా వెళ్తున్నారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని రోహిల్లా రైల్వే స్టేషన్ వెళ్లి…అక్కడి నుంచి ఉదయ్ పూర్ రైలు ఎక్కారు. ఇక శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న చింతన్ శిబిర్ ఈ నెల 15వరకు మూడురోజుల పాటు కొనసాగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా పార్టీ హైకమాండ్ 400మంది కీలక నేతలకు ఆహ్వానం పంపించిన విషయం తెలిసిందే.