Rahul Gandhi : కర్ణాటక ఆర్డినెన్స్‌పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ఇది దేశంలో గిగ్ కార్మికుల సంక్షేమానికి శాసన పరంగా మద్దతుగా నిలిచే తొలి చర్యలలో ఒకటిగా ఆయన అభిప్రాయపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Rahul Gandhi comments on Karnataka Ordinance

Rahul Gandhi comments on Karnataka Ordinance

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గిగ్ వర్కర్ల హక్కులు, సంక్షేమం పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా పనిచేస్తున్న గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన తన ఆవేదనను వెల్లడించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా తమను కలిసిన గిగ్ వర్కర్లు చెప్పిన మాటలు ఇప్పటికీ తన మనసులో ముద్రగా నిలిచాయన్నారు. “మాకు రేటింగ్‌లు కాదు, హక్కులు కావాలి. మేము మనుషులమే, బానిసలం కాదు” అనే వారి ఆవేదనను గుర్తు చేస్తూ, తాను తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. ఈ నేపథ్యంలో, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ఇది దేశంలో గిగ్ కార్మికుల సంక్షేమానికి శాసన పరంగా మద్దతుగా నిలిచే తొలి చర్యలలో ఒకటిగా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతికూల వాతావరణం మధ్య రోజూ వేలాది గిగ్ కార్మికులు ప్రజలకు ఆహారం, నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయినా కూడా, వీరికి తగిన గుర్తింపు లేకపోవడం, భద్రత లేనిది, హక్కులు కాదని విమర్శించారు.

Read Also: CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలను వివరించిన రాహుల్ గాంధీ. “యాప్‌ల నుంచి ఎలాంటి సమాచారం లేకుండా అకస్మాత్తుగా బ్లాక్ చేయడం, అనారోగ్య కారణంగా సెలవులు మంజూరు కాకపోవడం, ఆదాయాలు పారదర్శకత లేని అల్గోరిథమ్స్ ఆధారంగా నిర్ణయించబడటం” వంటి అంశాలను ముఖ్యంగా ప్రస్తావించారు. ఈ సమస్యలకు పరిష్కారంగా కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ద్వారా గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, న్యాయమైన ఒప్పందాలు, చెల్లింపులలో పారదర్శకత, ఏకపక్షంగా తొలగింపుల నుంచి రక్షణ లభించనున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ టెక్నాలజీ ప్రజలకు సేవ చేయాల్సినదని, కార్మిక హక్కులను పరిగణనలోకి తీసుకునే విధంగా వ్యవస్థలను మలచుకోవాలని సూచించారు. ఈ దిశగా రాజస్థాన్ మరియు కర్ణాటక రాష్ట్రాలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కొనియాడారు. త్వరలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరిస్తుందని సూచించారు. గిగ్ మరియు ప్లాట్‌ఫార్మ్ ఆధారిత ఉపాధి అవకాశాలు నూతన అవకాశాలను సృష్టిస్తున్నప్పటికీ, అవి సంప్రదాయ కార్మిక సంబంధాలను మార్చేస్తున్నాయని, ఈ మార్పులో కార్మికుల హక్కులు కేంద్రీకృతంగా ఉండాలని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ శ్రమజీవుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తుందన్నారు.

Read Also: Kavitha : ఎంపీగా పోటీ చేస్తే పార్టీలోనే కుట్రపూరితంగా ఓడించారు : కవిత

  Last Updated: 29 May 2025, 12:48 PM IST