Site icon HashtagU Telugu

Painless death: చావు కబురు చల్లగా.. నిమిషంలో నొప్పిలేని మరణం!

Death

Death

పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు.. అని అంటుంటారు పెద్దలు. భగవద్గీత కూడా ఇదే విషయం చెబుతుంది. అయితే మనిషి జననం ఎంత వేదనతో కూడుకూన్నదో.. మరణం కూడా అదే అంతే వేదనతో ఉంటుంది. నూటికి పదిశాతం మాత్రమే ప్రశాంతంగా కనుమూస్తారు. కానీ చాలామంది రోగమో.. ఇతర అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతూ కాలం చేస్తుంటారు. జీవిత చరమాంకంలో ప్రశాంతమైన చావును కోరుకుంటుంటా చాలామంది. కానీ అందరికీ సాధ్యంకాకపోవచ్చు. అలాంటివాళ్ల కోసమే ఓ ప్రత్యేకమైన శవపేటిక మార్కెట్లోకి రోబోతోంది.

ఒక నిమిషంలోపు నొప్పిలేకుండా ప్రశాంతత చావను ప్రసాదించే టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇది స్విట్జర్లాండ్‌లో చట్టబద్ధం చేయబడిందని మిషన్ తయారీదారులు తెలిపారు. పాడ్‌లో ఆక్సిజన్‌ను కీలక స్థాయికి తగ్గించడం ద్వారా హైపోక్సియా, హైపోకాప్నియా ద్వారా మరణం సంభవిస్తుంది. యంత్రాన్ని ఉపయోగించే వ్యక్తి లాక్-ఇన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న సందర్భంలో రెప్పవేయడం ద్వారా కూడా లోపల నుంచి. ఆపరేట్ చేయవచ్చు. (దీనిలో రోగికి తెలుసు, కానీ శరీరంలోని దాదాపు అన్ని స్వచ్ఛంద కండరాలు పూర్తిగా పక్షవాతం కారణంగా కదలడం లేదా మాటలతో కమ్యూనికేట్ చేయడం సాధ్యం కాదు)

యంత్రం వినియోగదారుని ఇష్టపడే ప్రదేశానికి తీసుకువెళ్తుతుంది. శవపేటిక వలె పనిచేయడానికి బయోడిగ్రేడబుల్ క్యాప్సూల్ బేస్ నుంచి వేరు చేయబడుతుంది. ‘డాక్టర్ డెత్’ అని కూడా పిలువబడే ఎగ్జిట్ ఇంటర్నేషనల్ అనే నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ డాక్టర్ ఫిలిప్ నిట్ష్కే ఆత్మహత్య పాడ్ వెనుక ఉన్న ఆలోచన ఇదట. “ఏదైనా ఊహించని ఇబ్బందులు మినహా, వచ్చే ఏడాది స్విట్జర్లాండ్‌లో సార్కోను అందుబాటులోకి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నా. ఇది ఇప్పటివరకు చాలా ఖరీదైన ప్రాజెక్ట్, కానీ మేము ఇప్పుడు అమలుకు చాలా దగ్గరగా ఉన్నా.” అని డాక్టర్ ఫిలిప్ నిట్ష్కే చెప్పారు.