Site icon HashtagU Telugu

KLEF : వినూత్న బయోసెన్సర్‌లను పరిశోధించిన కెఎల్ఈఎఫ్ ఫ్యాకల్టీ, జర్మన్ శాస్త్రవేత్తలు

KLEF faculty, German scientists research innovative biosensors

KLEF faculty, German scientists research innovative biosensors

KLEF : ఆంధ్రప్రదేశ్‌లోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కెఎల్ఈఎఫ్ ), కెమిస్ట్రీ విభాగానికి చెందిన తమ ఫ్యాకల్టీ సభ్యులలో ఒకరు ఆరోగ్య సంరక్షణ పరిశోధనలో గణనీయమైన తోడ్పాటు అందించారని వెల్లడించింది. కెఎల్ఈఎఫ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి. అనూష , జర్మనీలోని టియు బెర్గాకడెమీ ఫ్రీబర్గ్‌కు చెందిన డాక్టర్ పర్వానేహ్ రహీమితో కలిసి సెప్సిస్‌ను ముందస్తుగా గుర్తించడం కోసం అధునాతన బయోసెన్సర్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిన ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.

Read Also: Deputy CM Bhatti : 56వేల ఉద్యోగాలిచ్చాం.. యువతకు మంచి భవితే మా లక్ష్యం : భట్టి

“డెవలప్మెంట్ అఫ్ ఆన్ ఎలక్ట్రోకెమికల్ బయోసెన్సింగ్ ప్లాట్‌ఫామ్ ఫర్ మల్టీప్లెక్స్డ్ సైమల్టేనియస్ డిటెక్షన్ ఆఫ్ సెప్సిస్ బయోమార్కర్స్ ” అనే వారి ప్రాజెక్ట్ కు ఇండో-జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ (ఐజిఎస్టిసి) కార్యక్రమం కింద నిధులు సమకూరుస్తుంది. బహుళ సెప్సిస్ బయోమార్కర్‌లను ఏకకాలంలో గుర్తించగల తక్కువ-ధర, పోర్టబుల్ మరియు వేగవంతమైన బయోసెన్సర్‌ను అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇన్ఫెక్షన్‌కు శరీరం ప్రతిస్పందన వల్ల కలిగే ప్రాణాంతక పరిస్థితి అయిన సెప్సిస్‌ను ముందుగా మరియు ఖచ్చితంగా గుర్తించడం ప్రాణాంతక ఫలితాలను తగ్గించడంలో కీలకం, ముఖ్యంగా అత్యవసర గదులు మరియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో !

ఈ పరిశోధన విస్తృత శ్రేణి వాటాదారులకు ప్రయోజనం చేకూర్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని రోగులు మరియు వైద్యులు వేగవంతమైన , మరింత ఖచ్చితమైన రోగనిర్ధారణ సాధనాలను పొందగలరు. ప్రస్తుతం ఖరీదైన , సమయం తీసుకునే పరీక్షలపై ఆధారపడే డయాగ్నస్టిక్ ప్రయోగశాలలు మరియు ఐసియు లు ఈ సాంకేతికతతో సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటాయి. తక్కువ వనరులు మరియు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలోని పాయింట్-ఆఫ్-కేర్ ప్రొవైడర్లు కూడా సరసమైన, నమ్మదగిన రోగనిర్ధారణల నుండి ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా, బయోమెడికల్ పరికరాలపై పనిచేసే స్టార్టప్‌లు మరియు ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలకు ఈ ప్రాజెక్ట్ కొత్త అవకాశాలను తెరుస్తుంది.

చిన్న రక్త నమూనా నుండి నిమిషాల్లో ఫలితాలను అందించగల బయోసెన్సర్ యొక్క వర్కింగ్ ప్రొటోటైప్ అభివృద్ధి చేయడం ముఖ్య లక్ష్యాలలో ఒకటి. ఇది వైద్యులు త్వరగా చికిత్స ప్రారంభించడానికి వీలు కల్పిస్తుంది, రోగి మనుగడ రేటును పెంచుతుంది. శాస్త్రీయ ఆవిష్కరణతో పాటు, ఈ ప్రాజెక్ట్ టెక్నాలజీ బదిలీ మరియు స్టార్టప్‌లతో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది, ఆరోగ్య సంరక్షణ రంగంలో వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా, డాక్టర్ అనూష ఆగస్టు 2025లో జర్మనీని సందర్శించనున్నారు. ఆమె అక్కడ వుండే సమయంలో, టియు బెర్గాకడెమీ ఫ్రీబర్గ్‌లోని పరిశోధనా బృందంతో సన్నిహితంగా సహకరించటంతో పాటుగా నైపుణ్యాన్ని పంచుకుంటారు మరియు బయోసెన్సర్ అభివృద్ధిని వేగవంతం చేయడంలో కృషి చేయనున్నారు.

Read Also: Shami- Iyer: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ!