నెల రోజుల పరీక్షల తర్వాత భారత అంతరిక్షపరిశోధనా సంస్ధ ఇస్రో.. ఒక ఇంపార్టెంట్ స్టేట్మెటంట్ రిలీజ్ చేసింది. చంద్రయాన్ 2 ఆర్బిటర్ కక్ష్యను మార్చబోతున్నట్టు ప్రకటించింది. నాసా రీకనయిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ ఆర్ ఓ)తో ఢీకొనే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెబుతోంది ఇస్రో.
చంద్రుడి ఉత్తర ధృవం దగ్గర 2021 అక్టోబర్ చంద్రయాన్ ఆర్బిటర్, నాసా ఎల్ ఆర్ ఓలు అతి సమీపానికి వచ్చే అవకాశముందని, అది దాదాపు 100 మీటర్ల నుంచి 3 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడి కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల 22నిమిషాలకు ఇది జరగవచ్చని అంటున్నారు.ఆర్బిటర్కు, ఎల్ ఆర్ ఓకు ఎలాంటి నష్టం జరగకుండా చంద్రయాన్ 2 రోవర్ కక్ష్యను మార్చాలని నాసాతో చర్చల తర్వాత నిర్ణయించినట్టు ఇస్రో ప్రకటించింది.