PM Modi: ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తత దాదాపు శాంతించింది. భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ కింద ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది. దీని తర్వాత రెండు దేశాల మధ్య సరిహద్దులో సైనిక యుద్ధం కనిపించింది. మే 7 నుంచి మే 10 వరకు జరిగిన సైనిక కార్యకలాపాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ రోజు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
పీఎం మోదీ ఇలా అన్నారు. “ఉగ్రవాదులను నాశనం చేయడానికి మేము దేశ సైన్యాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. ఈ ఆపరేషన్ తర్వాత ఉగ్రవాదులకు తెలిసింది. భారత దేశ కుమార్తెల మాంగల్యాన్ని తొలగించడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో పాక్కు తెలిసి వచ్చింది. భారత్ ఈ దాడుల్లో 100 కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు మరణించారు. శతాబ్దాలుగా పాకిస్తాన్లో బహిరంగంగా తిరిగిన ఉగ్రవాద నాయకులను భారత్ ఒక్క దెబ్బతో నాశనం చేసిందని పేర్కొన్నారు.
Also Read: UPI Down: మరోసారి యూపీఐ డౌన్.. ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు షాక్!
పీఎం మోదీ మరింత మాట్లాడుతూ.. భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోగలదని ఉగ్రవాదులు కలలో కూడా ఊహించలేదు. కానీ దేశం ఏకమైనప్పుడు, రాష్ట్రం సర్వోపరి అయినప్పుడు, ఉక్కు నిర్ణయాలు తీసుకోబడతాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మిస్సైల్స్, డ్రోన్లు దాడి చేసినప్పుడు ఉగ్రవాదుల భవనాలు మాత్రమే కాదు, వారి ధైర్యం కూడా కదిలిపోయిందని అన్నారు. భారత్ ఈ చర్యతో పాకిస్తాన్ తీవ్ర నిరాశలో మునిగిపోయి కలవరపడింది. ఈ నిరాశలోనే అది నీచమైన పనులు చేసింది. ఉగ్రవాదులను అదుపు చేయడానికి బదులు, భారత సరిహద్దులపై దాడులు చేయడం ప్రారంభించింది. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కానీ దీనితో అది ప్రపంచం ముందు బహిర్గతమైంది.
ఆపరేషన్ సిందూర్ పేరిట చేపట్టిన సైనిక చర్యకు తాత్కాలిక విరామం ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. పాకిస్థాన్ వేసే ప్రతి అడుగును పరిశీలిస్తున్నాం. మన బలగాలు పూర్తి స్థాయి అప్రమత్తతో ఉన్నాయి. అణు బాంబుల పేరుతో బెదిరింపులు సహించే ప్రసక్తే లేదు. ఆపరేషన్ సిందూర్ ఇకపై కొనసాగనుంది అని మోదీ పేర్కొన్నారు. పాకిస్థాన్తో భారత్ కేవలం ఉగ్రవాదం, పీవోకేలపై మాత్రమే చర్చిస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పాక్ అంతం చేయకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్నారు. యుద్ధంలో పాకిస్తాన్కు ప్రతిసారి భయం కలిగించామని తెలిపారు. భారత దళాల దాడితో పాక్కు మూడు రోజుల్లోనే చెమటలు పట్టాయని మోదీ ఎద్దేవా చేశారు. భయాందోళనకు గురైన పాక్ మన డీజీఎంవోతో కాళ్ల బేరానికి వచ్చిందన్నారు.