CM Revanth Reddy : చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలి : సీఎం రేవంత్‌రెడ్డి

మన పిల్లలు, మన భవిష్యత్తు. వారికి ఎలాంటి భయమూ లేకుండా వృద్ధి చెందేలా చేయడం ప్రభుత్వ ధర్మం అని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత’ అంశంపై జరుగుతున్న సదస్సులో సీఎం రేవంత్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Published By: HashtagU Telugu Desk
CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy : రాష్ట్రంలో చిన్నారులు, మహిళల భద్రతపై తమ ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. లైంగిక దాడుల బాధితులకు భరోసా కేంద్రాల ద్వారా మానసిక, న్యాయ, వైద్య సహాయాన్ని అందిస్తున్నామని ఆయన వివరించారు. మన పిల్లలు, మన భవిష్యత్తు. వారికి ఎలాంటి భయమూ లేకుండా వృద్ధి చెందేలా చేయడం ప్రభుత్వ ధర్మం అని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత’ అంశంపై జరుగుతున్న సదస్సులో సీఎం రేవంత్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిన్నారులపై లైంగిక హింస దేశం అంతటా ఒక తీవ్రమైన సమస్యగా మారిందన్నారు. ఇటువంటి ఘటనలను సమాజమంతా తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.

Read Also: Dalai Lama : ఇంకో 30-40 ఏళ్లు జీవించాలని నా ఆకాంక్ష : దలైలామా

చిన్నారులపై హింసకు పాల్పడే దోషులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని హెచ్చరించిన సీఎం ఇలాంటి ఘటనలపై ప్రభుత్వ చర్యలు తీవ్రంగా ఉంటాయి. న్యాయవ్యవస్థతో సమన్వయంగా నిందితులకు కఠిన శిక్షలు విధించేందుకు మేము కట్టుబడి ఉన్నాం అని స్పష్టం చేశారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర డీజీపీ జితేందర్‌, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. న్యాయ, పోలీసు వ్యవస్థల మధ్య సమన్వయంతోనే బాధితులకు సమర్ధవంతమైన రక్షణ, న్యాయం సాధ్యమవుతుందన్నది నాయకుల అభిప్రాయం. చిన్నారుల భద్రతలో సామాజిక మాధ్యమాల ప్రాధాన్యం గణనీయమైందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషియల్‌ మీడియా వల్ల పలు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పిల్లలు ఏం చూస్తున్నారో, ఎవరిద్వారా ప్రభావితమవుతున్నారు అనే విషయాల్లో జాగ్రత్త అవసరం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో భరోసా కేంద్రాలు మహిళలు, బాలికలకు ఆపన్నహస్తంగా నిలుస్తున్నాయని సీఎం వివరించారు. పోలీస్, వైద్య, సైకాలజికల్ సపోర్ట్‌ను ఒకేచోట అందించే ఈ కేంద్రాల ద్వారా బాధితులు న్యాయం పొందే అవకాశాలు మెరుగుపడుతున్నాయని అన్నారు. భవిష్యత్‌లో ఈ కేంద్రాలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సదస్సు ముగింపులో సీఎం చిన్నారులు భయపడే సమాజం మన లక్ష్యముకాదు. వారికి సురక్షితమైన భవిష్యత్తును అందించడమే మన కర్తవ్యం అంటూ సభను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు.

Read Also: Kamal Haasan : కమల్ హాసన్‌కు బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు

  Last Updated: 05 Jul 2025, 01:22 PM IST