We’re now on WhatsApp. Click to Join.
‘‘డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ(Direct To Mobile) ఇంటర్నెట్కు పోటీ కాదు. ఇది వైఫై సాంకేతికతను పోలి ఉంటుంది’’ అని వివరించారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది లో రేంజ్లోని స్మార్ట్ ఫోన్లు, 3జీ కనెక్షన్లను వినియోగిస్తున్నారు. ఎంతోమంది నేటికీ హై స్పీడ్ డేటాకు మారలేదు. ఫ్యూచర్లో D2M టెక్నాలజీ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే డేటాను వాడుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మొబైళ్లు ఈ సాంకేతికతకు సపోర్ట్ చేయవని అంటున్నారు. దీని కోసం మొబైళ్లలో యాంటెనా, తక్కువ శబ్దం చేసే యాంప్లిఫైయర్లు, బేస్బ్యాండ్ ఫిల్టర్లు, రిసీవర్, ప్రత్యేక బేస్బ్యాండ్ ప్రాసెసింగ్ యూనిట్లను కలిగి ఉండాలి.
మొబైల్లో వీడియోలు,సినిమాలు లేదా టీవీ ఛానెల్లను చూడటానికి SIM కార్డ్ లేదా ఇంటర్నెట్ రెండూ అవసరం. కానీ ఇకపై సిమ్,ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫోన్ లో వీడియోలు చూడవచ్చు. డైరెక్ట్-టు-మొబైల్(D2M)అనే కొత్త టెక్నాలజీతో ఇది సాధ్యమవుతుంది. దేశీయ “డైరెక్ట్-టు-మొబైల్ (D2M)” టెక్నాలజీని త్వరలో దేశంలోని 19 నగరాల్లో టెస్ట్ చేయనున్నట్లు సమాచార-ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఈ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కోసం 470-582 MHz స్పెక్ట్రమ్ను రిజర్వ్ చేయాల్సి ఉంటదని తెలిపారు. 25-30 శాతం వీడియో ట్రాఫిక్ను D2Mకి మార్చడం వల్ల 5G నెట్వర్క్లలో రద్దీ తగ్గుతుందని, ఇది దేశంలో డిజిటల్ పరివర్తనను వేగవంతం చేస్తుందని చంద్ర చెప్పారు. గత సంవత్సరం, బెంగళూరు, నోయిడాలో D2M టెక్నాలజీని టెస్ట్ చేసే పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయబడింది.