Direct To Mobile : డైరెక్ట్ టు మొబైల్.. ఇంటర్నెట్​ లేకుండానే లైవ్​ టీవీ, ఓటీటీ

Direct To Mobile : ఇంటర్నెట్​ లేకుండానే ఫోన్​లో ‘లైవ్​ టీవీ’.. ఇంటర్నెట్​ లేకుండానే ‘ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్’.. ఇవన్నీ సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యే విషయాలే!!

Published By: HashtagU Telugu Desk
Direct To Mobile

Direct To Mobile

Direct To Mobile : ఇంటర్నెట్​ లేకుండానే ఫోన్​లో ‘లైవ్​ టీవీ’.. ఇంటర్నెట్​ లేకుండానే ‘ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్’.. ఇవన్నీ సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యే విషయాలే!! ఔను.. నిజమే !!  ఇవన్నీ నిజం చేయగలిగే  ‘డైరెక్ట్​ టు మొబైల్ (D2M)’ బ్రాడ్​కాస్టింగ్ సాంకేతికత వచ్చే ఏడాదికల్లా సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈవిషయాన్ని భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి అభయ్ కరాండికర్ వెల్లడించారు. ఇంటర్నెట్​తో పాటు ఈ కొత్త సాంకేతికత కూడా వినియోగంలో ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ వినియోగంపై ల్యాబ్​ ట్రయల్స్​ జరగుతున్నాయని తెలిపారు. తదుపరిగా నగరాల వారీగా ల్యాబ్​ ట్రయల్స్ జరుగుతాయని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘డైరెక్ట్​ టు మొబైల్ టెక్నాలజీ(Direct To Mobile) ఇంటర్నెట్​కు పోటీ కాదు. ఇది వైఫై సాంకేతికతను పోలి ఉంటుంది’’ అని వివరించారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది లో రేంజ్‌లోని స్మార్ట్ ​ఫోన్లు, 3జీ కనెక్షన్లను వినియోగిస్తున్నారు. ఎంతోమంది నేటికీ హై స్పీడ్ డేటాకు మారలేదు. ఫ్యూచర్‌లో D2M టెక్నాలజీ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే డేటాను వాడుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మొబైళ్లు ఈ సాంకేతికతకు సపోర్ట్ చేయవని అంటున్నారు. దీని కోసం మొబైళ్లలో యాంటెనా, తక్కువ శబ్దం చేసే యాంప్లిఫైయర్​లు, బేస్​బ్యాండ్​ ఫిల్టర్​లు, రిసీవర్​, ప్రత్యేక బేస్​బ్యాండ్ ప్రాసెసింగ్ యూనిట్లను కలిగి ఉండాలి.

Also Read: Shahi Idgah Complex : శ్రీకృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఆ సర్వేపై స్టే

మొబైల్‌లో వీడియోలు,సినిమాలు లేదా టీవీ ఛానెల్‌లను చూడటానికి SIM కార్డ్ లేదా ఇంటర్నెట్ రెండూ అవసరం. కానీ ఇకపై సిమ్,ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫోన్ లో వీడియోలు చూడవచ్చు. డైరెక్ట్-టు-మొబైల్(D2M)అనే కొత్త టెక్నాలజీతో ఇది సాధ్యమవుతుంది.  దేశీయ “డైరెక్ట్-టు-మొబైల్ (D2M)” టెక్నాలజీని త్వరలో దేశంలోని 19 నగరాల్లో టెస్ట్ చేయనున్నట్లు సమాచార-ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఈ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కోసం 470-582 MHz స్పెక్ట్రమ్‌ను రిజర్వ్ చేయాల్సి ఉంటదని తెలిపారు. 25-30 శాతం వీడియో ట్రాఫిక్‌ను D2Mకి మార్చడం వల్ల 5G నెట్‌వర్క్‌లలో రద్దీ తగ్గుతుందని, ఇది దేశంలో డిజిటల్ పరివర్తనను వేగవంతం చేస్తుందని చంద్ర చెప్పారు. గత సంవత్సరం, బెంగళూరు, నోయిడాలో D2M టెక్నాలజీని టెస్ట్ చేసే పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయబడింది.

  Last Updated: 16 Jan 2024, 08:07 PM IST