Site icon HashtagU Telugu

China : పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు చైనా కీలక నిర్ణయం..!

China key decision to further boost the tourism sector..!

China key decision to further boost the tourism sector..!

China : పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తలచిన చైనా ప్రభుత్వం, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే దిశగా ఓ కీలక చర్యకు శ్రీకారం చుట్టింది. తమ దేశంలో స్వల్పకాలికంగా పర్యటించాలనుకునే విదేశీ పర్యాటకులకు చైనా భారీ ఊరటను ప్రకటించింది. 55 దేశాలకు చెందిన పౌరులు ఇకపై చైనాలో 240 గంటల (దాదాపు 10 రోజులు) వరకు వీసా లేకుండానే ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు. ఈ విషయం ప్రభుత్వ వార్తా సంస్థ అయిన షిన్హువా న్యూస్‌ ఏజెన్సీ ద్వారా వెల్లడించబడింది. ఈ జాబితాలో ఇండోనేషియా, రష్యా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (UK), ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ వంటి పలు దేశాలు ఉన్నాయి. దీంతో చైనాలో టూరిజం మరింత ఉత్సాహంగా మారే అవకాశం ఉందని అంచనా. ఈ పాలసీ 2025 జూన్ 13వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

Read Also: Honeymoon Murder: హనీమూన్ హత్య కేసులో మ‌రిన్ని సంచలన విషయాలు!

ఈ కొత్త విధానం ద్వారా విదేశీయులు పర్యాటక ప్రయాణాలు, కుటుంబసభ్యుల సందర్శనలు వంటి పనుల నిమిత్తంగా చైనాకు రావచ్చు. అయితే విద్యాభ్యాసం, ఉపాధి, మీడియా రిపోర్టింగ్‌ వంటి కార్యకలాపాలకు మాత్రం సాధారణ వీసా ప్రక్రియలు అనుసరించాల్సిందే. వీసా మినహాయింపు ప్రయోజనాన్ని పొందాలంటే, ప్రయాణికులు ధ్రువీకరించబడిన ఇంటర్‌లైన్‌ టికెట్లు (చైనాకు వచ్చిన తరువాత మరో దేశానికి వెళ్లే టికెట్‌) మరియు చట్టబద్ధమైన పత్రాలను చూపించాలి. చైనా దేశంలో 24 ప్రావిన్స్‌లకు చెందిన 60 ఓపెన్ పోర్టుల (ఎయిర్‌పోర్ట్‌లు, సీ పోర్ట్‌లు) ద్వారా వారు దేశంలోకి ప్రవేశించవచ్చు. ముఖ్యంగా బీజింగ్‌, షాంఘై‌, గ్వాంగ్‌జౌ వంటి ప్రధాన నగరాల్లో తాత్కాలికంగా తిరగచ్చు.

ఈ విధానం అమల్లోకి రావడం వల్ల, చిన్నసేపు పర్యటనలు చేయాలనుకునే పర్యాటకులకు ప్రయోజనం కలుగుతుంది. అంతేకాదు, చైనాలోని వ్యాపార, పర్యాటక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి ఆశించవచ్చు. కొవిడ్‌ అనంతర కాలంలో ప్రపంచ దేశాల పర్యాటక రంగాలు తిరిగి ఊపందుకుంటున్న వేళ, చైనా ఈ చర్యతో ముందంజ వేసింది. ఇందులో మరొక విశేషం ఏమిటంటే, ఇది అంతర్జాతీయ పర్యటనల హబ్‌గా చైనాను నిలబెట్టే లక్ష్యంతో తీసుకొన్న పాలసీ కావడం. ఇతర దేశాల పౌరులు చైనాలో కేవలం లేఅవర్‌ (ట్రాన్సిట్‌ స్టే) మాత్రమే కాకుండా, పర్యాటక అనుభవాన్ని కూడా పొందేలా వీలుకల్పించనుంది. ఈ విధానం ద్వారా చైనా తన సాఫ్ట్ పవర్‌ను మరింతగా ప్రదర్శించే అవకాశం పొందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Also: AP News : ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి.. ‘పేదల సేవలో’ నుంచి ‘తల్లికి వందనం’ వరకు..!