Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లా ఘోల్తీర్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బద్రీనాథ్కు వెళ్లి తిరిగి వస్తున్న పర్యాటకులతో కూడిన ఒక ప్రయాణికుల బస్సు అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒకరు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. మరో 10 మంది ప్రయాణికులు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఘోల్తీర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇది రుద్రప్రయాగ్ జిల్లాలో పర్వతాల మధ్య నదీ పరివాహక ప్రాంతంగా ఉంటుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. వీరిలో చాలా మంది ఉత్తర భారత రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులుగా గుర్తించబడుతున్నారు.
#Uttarakhand | A bus went out of control and fell into the #Alaknanda river in Gholthir area of #Rudraprayag district. As per information received so far, 18 people were on board the bus." pic.twitter.com/3ae6WNwX4l
— News Bulletin (@newsbulletin05) June 26, 2025
Read Also: Rajnath Singh: చైనా వేదికగా పాక్కు వార్నింగ్ ఇచ్చిన భారత్!
ప్రమాద సమాచారం అందిన వెంటనే జిల్లా అధికారులు, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. నదిలో ఉన్న మిగిలిన ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, వరుణదేవుడు అడ్డుపడినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు పొంగిపొర్లుతున్నాయి. దీనివల్ల గాలింపు చర్యలకు అంతరాయంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. గాయపడిన ఏడుగురిని దగ్గరలోని రుద్రప్రయాగ్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిగిలినవారిని ప్రత్యేక హెలికాప్టర్ల సాయంతో డెహ్రాడూన్ ఆసుపత్రులకు తరలించే యోచనలో ఉన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కుటుంబాలకు ఓదార్పు తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ కూడా ఈ ఘటనపై సమీక్ష నిర్వహించి అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించింది.
ప్రస్తుతం ప్రమాదానికి గల అసలు కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. డ్రైవర్ నిర్లక్ష్యమా? వాహనంలో లోపమా? లేక రహదారి ప్రమాదకర పరిస్థితులా అన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. బస్సు ఎడ్జ్ను దాటి నదిలోకి జారిపోవడం చూసిన స్థానికులు వెంటనే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలి వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లో చాలా చోట్ల భూమి కదలికలు, గాలివానలు, నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పర్యాటకులకు హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతేనే ప్రయాణించాలని, ప్రత్యేకంగా పర్వత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ ప్రమాదం మళ్లీ మరోసారి హెచ్చరికగా మారింది. పర్యాటక ప్రాంతాల్లో సరైన భద్రతా ఏర్పాట్లు ఉండాలన్న అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అంటున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
Read Also: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్కు ఏమైంది? స్పోర్ట్స్ హెర్నియా అంటే ఏమిటి?