BJP : కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి ప్రేమ్ లతపై బీజేపీ అభ్యర్థి హర్ప్రీత్ కౌర్ బబ్లా గెలిచారు. కాషాయ పార్టీకి 19 ఓట్లు రాగా, ఆప్కి 17 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు బబ్లాను మేయర్గా ప్రకటించారు. ఈ ఎన్నికలు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జైశ్రీ ఠాకూర్ పర్యవేక్షణలో జరిగాయి. రెండు ఓట్ల తేడాతో బబ్లా విజయాన్ని నమోదు చేశారు. చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్లోని అసెంబ్లీ హాల్లో ఈరోజు ఉదయం 11.20 గంటలకు మొదలైన మేయర్ ఎన్నిక 12.19 గంటలకు ముగిసింది.
వాస్తవానికి చండీగఢ్ కార్పోరేషన్లో ఆప్కు 13 మంది, కాంగ్రెస్కు ఆరుగురు సభ్యుల బలం ఉంది. బీజేపీకి 16 మంది సభ్యులు, ఒక ఎంపీ ఉన్నారు. అయితే ఆప్-కాంగ్రెస్ కూటమి నుంచి ఇద్దరు సభ్యులు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో బబ్లా విజయం సాధించారు. చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్లో మొత్తం 35 మంది సభ్యులు ఉన్నారు. ఎన్నికైన కార్పోరేషన్ సభ్యులతోపాటు స్థానిక ఎంపీ కూడా ఎక్స్ అఫిషియో మెంబర్గా ఓటు వేస్తారు.
కాగా, మేయర్ ఎన్నిక సజావుగా జరిగేలా చూసేందుకు డిసి సన్నాహాలను సమీక్షించి అధికారులకు అవసరమైన సూచనలు ఇస్తూ చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ యాదవ్ అధ్యక్షతన బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీ) కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల సన్నాహాల్లో భద్రతా ఏర్పాట్లు, లాజిస్టిక్స్, నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించడం వంటి అంశాలను డిప్యూటీ కమిషనర్ సమీక్షించారు. మునిసిపల్ కార్పొరేషన్ మరియు చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు మరియు పోలీసు అధికారులతో DC చర్చలు జరిపారు. న్యాయమైన, పారదర్శకమైన మరియు సమర్థవంతమైన ఎన్నికల ప్రక్రియ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
Read Also: Hyderabad Student: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాదీ విద్యార్థి మృతి