Viral Video: సైకిల్ పై 9 మంది ప్రయాణం.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో

ప్రపంచ జనాభా 2030లో 8.5 బిలియన్లు.ప్రస్తుతం 1.39 బిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న భారతదేశ జనాభా 2023లో చైనాను అధిగమించి

  • Written By:
  • Updated On - November 18, 2022 / 11:42 AM IST

ప్రపంచ జనాభా 2030లో 8.5 బిలియన్లు.ప్రస్తుతం 1.39 బిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న భారతదేశ జనాభా 2023లో చైనాను అధిగమించి పెరుగుతుందని అంచనా. ఆఫ్రికా కంట్రీలోనూ జనాభా పెరుగుతోంది. ఈ పెరుగుదల పేదల దుర్భర స్థితికి అద్దం పడుతోంది. ఈ ఘటనను అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.  ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఎనిమిది పిల్లలను సైకిల్ పై తీసుకెళ్తున్న ఫొటో ఒకటి వైరల్ గా మారింది.

వీడియోలో సైకిల్ వెనుక భాగంలో ముగ్గురు, ముందు భాగంలో మరో ముగ్గురు, సీటుపై మరో ఇద్దరిని ఆ వ్యక్తి తీసుకెళ్లడం చూడొచ్చు. వ్యక్తి సైకిల్ తొక్కుతున్నప్పుడు ముందు, వెనుక ఉన్న పిల్లలు సైకిల్ హ్యాండిల్, సీటుతోపాటు ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకోవడం చూడొచ్చు. ఈ వీడియో 191k పైగా వ్యూస్ సాధించి వైరల్ గా మారింది. చాలా మంది పిల్లలతో సైకిల్ తొక్కుతున్న వ్యక్తిని చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఇది చాలా డేంజరస్. ఇంత మంది పిల్లలను సైకిల్ మీద తీసుకెళ్తారా అంటూ కామెంట్స్ చేశారు.