YS Sharmila: పాలేరు బరిలో వైఎస్ షర్మిల

హైదరాబాద్‌లో కాకుండా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు.

  • Written By:
  • Updated On - June 20, 2022 / 05:25 PM IST

2024 జూన్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాకుండా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. ఈ మేరకు తాను పాలేరులో షర్మిల తన పార్టీ సభ్యులతో సమావేశమయ్యారు. పాలేరు నుంచి పోటీ చేయాలని పార్టీ సభ్యులు కోరడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. “ఇప్పటి నుండి నేను హైదరాబాద్ కాదు. పాలేరు నివాసిని” అని ఆమె చెప్పింది. రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఆమె ప్రజలను కోరారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మంత్రి పువ్వాడపై తీవ్రమైన విమర్శలు చేశారు. ‘‘పువ్వాడ ఒక కంత్రీ మంత్రి. పువ్వాడ వైద్య కళాశాలకు ఇబ్బందని ప్రభుత్వ మెడికల్ కాలేజీని రానివ్వడం లేదు. మెడికల్ సీట్లు రూ.3 కోట్లకు అమ్ముకుంటున్నారు. వైఎస్సార్ బిడ్డకు బయ్యారంలో భాగం ఉందన్న.. ప్రచారంలో వాస్తవం లేదు’’ షర్మిల తెలిపారు.