YS Sharmila React: ‘మంగ‌ళ‌వారం మ‌ర‌ద‌లు’ అంటే ఊరుకోవాలా!

తమను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని

  • Written By:
  • Publish Date - September 14, 2022 / 05:20 PM IST

తమను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(Sharmila) పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తోనే తన ప్రసంగాలు కొనసాగాయన్నారు. సీఎం కేసీఆర్‌(CM KCR)పై ఎన్నో విమర్శలు చేశానని షర్మిల పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే గమ్ముగా ఉన్న ఎమ్మెల్యేలు.. తమపై విమర్శలు వస్తేనే స్పందిస్తారా..? అని షర్మిల నిలదీశారు. మంత్రి నిరంజన్ రెడ్డి చాలా దారుణంగా ప్రవర్తించాడని.. అందుకే అంతటి విమర్శలు చేసినట్టు తెలిపారు.

స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నాపై చ‌ర్య‌ల‌కు ఆలోచ‌న చేసే ముందు… మీకు పిర్యాదు చేసిన మంత్రి నిరంజ‌న్ రెడ్డి న‌న్ను మంగ‌ళ‌వారం మ‌ర‌ద‌లు అని అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించార‌ని.. ప‌రాయి స్త్రీ , ఒక త‌ల్లిని అయిన న‌న్ను అలాంటి మాట‌లు మాట్లాడినందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ష‌ర్మిల స్పీకర్ పోచారంకు విజ్ఞప్తి చేశారు.