CM Revanth Reddy: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ విశిష్ట మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11:00 గంటలకు హెలిప్యాడ్ ద్వారా యాదగిరిగుట్టకు చేరుకొని, 11:25 నుంచి 12:15 వరకు జరిగే కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొంటారు. భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు భక్తుల దర్శనాలను ఆలయ అధికారులు నిలిపివేశారు. మధ్యాహ్నం 12:25 నుంచి 12:45 వరకు సీఎం, ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయనున్నారు.
ఈ మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిత్య కైంకర్యాల్లో తాత్కాలిక మార్పులు చేశారు. ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనాలు, ఉచిత దర్శనాలు, రూ.150 టికెట్ దర్శనాలు, నిత్య కళ్యాణోత్సవాలు, పుష్పార్చన సేవలను అధికారులు రద్దు చేశారు. భక్తుల సౌలభ్యం కోసం ప్రధాన గోపుర దర్శనాన్ని వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేపట్టారు.
Telangana CM : చేతకాని సీఎం రేవంత్ – MLC కవిత కీలక వాఖ్యలు
యాదగిరిగుట్ట బంగారు విమాన గోపురం దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. 50.5 అడుగుల ఎత్తుతో, 10,759 చదరపు అడుగుల వైశాల్యంలో విస్తరించిన ఈ గోపురం నిర్మాణం కోసం 68 కిలోల బంగారాన్ని వినియోగించారు. 2024 డిసెంబర్ 1న ప్రారంభమైన స్వర్ణ తాపడం పనులు, 2025 ఫిబ్రవరి 18 నాటికి పూర్తి అయ్యాయి. ఈ పంచతల గోపుర నిర్మాణానికి మొత్తం రూ. 80 కోట్లు ఖర్చు చేశారు. భక్తుల నమ్మకానికి, తెలంగాణ సాంస్కృతిక సంపదకు ప్రతీకగా నిలిచిన ఈ బంగారు గోపుర మహోత్సవం భారత దేవాలయాల చరిత్రలో మరొక మైలురాయిగా నిలవనుంది.
ఈ మహోత్సవాన్ని నిరాటంకంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన, ప్రజాప్రవాహం దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల కోసం ప్రత్యేక షెడ్లు, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. భక్తులు క్రమశిక్షణగా నడుచుకుంటే, ఈ మహోత్సవం అందరికీ చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కృపతో, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి మరింత ఉజ్వలంగా కొనసాగనుంది..
7 Planets Parade: ఫిబ్రవరి 28న ఒకే వరుసలో సప్తగ్రహాలు.. ఎలా చూడాలి ?