Hyderabad Traffic Police: రాంగ్ రూట్ డ్రైవింగ్.. ఒక్కరోజే 3 వేల కేసులు బుక్

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం సిగ్నల్ జంప్ చేసినా, రాంగ్ రూట్ డ్రైవ్ చేసినా వెంటనే అలర్ట్

Published By: HashtagU Telugu Desk
Helmet Rule

Helmet Rule

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సిగ్నల్ జంప్ చేసినా, రాంగ్ రూట్ డ్రైవ్ చేసినా వెంటనే అలర్ట్ అవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిని, ట్రిపుల్ రైడింగ్ చేసినవారిని పట్టుకొని మరీ చలాన్లు వేస్తున్నారు. మొదటి రోజు నగరంలో ట్రాఫిక్ పోలీసులు రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై 3000 కేసులు, ట్రిపుల్ రైడింగ్‌పై 650 కేసులు నమోదు చేశారు.

రాంగ్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగిన 25 ప్రదేశాల్లో డ్రైవ్ మరికొన్ని రోజులు కొనసాగుతుంది. స్పెషల్ డ్రైవ్ సమయంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే రూ.1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 జరిమానా విధిస్తున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ డ్రైవింగ్ ఉల్లంఘనలను పరిశీలించి జరిమానాలు విధిస్తారు. ట్రాఫిక్ పోలీసులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై MV చట్టంలోని సెక్షన్ 119/177 & 184 కింద కేసులు బుక్ చేస్తారు. ట్రిపుల్ రైడింగ్‌లో పట్టుబడిన వారిపై MV చట్టంలోని సెక్షన్ 128/184 r/w 177 కింద బుక్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) AV రంగనాథ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. డ్రైవింగ్ రూల్స్ అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ‘ఈ-చలాన్’ వెబ్‌సైట్‌ను తనిఖీ చేసిన తర్వాత పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను చెల్లించాలి ”అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది రాంగ్ రూట్ వల్ల రోడ్డు ప్రమాదాల్లో 15 మంది చనిపోగా, 2021లో 21 మంది, 2020లో 15 మంది మరణించారు. ట్రిపుల్ రైడింగ్ కారణంగా ఈ ఏడాది 8 మంది, 2021లో 15 మంది మరణించారు.

  Last Updated: 29 Nov 2022, 12:26 PM IST