Sarojini Naidu : తెలుగు వీర వనిత సరోజినీ నాయుడు.. నిజాం నవాబు మెచ్చిన రచయిత్రి !

సరోజినీ(Sarojini Naidu) కూడా ఆరేళ్ల వయసు నుంచే ఆంగ్లంలో కవితలు రాసేది. ఆమెకు పర్షియన్ భాష కూడా వచ్చు.

Published By: HashtagU Telugu Desk
Womens Day 2025 Telugu Freedom Fighter Sarojini Naidu Womens Vote

Sarojini Naidu : ‘ప్రపంచ మహిళా దినోత్సవం’ మార్చి 8న జరగబోతోంది. ఈసందర్భంగా మనం తప్పకుండా స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఒక తెలుగు వీర వనిత గురించి తెలుసుకోవాలి. ఆమె మరోవరో కాదు.. భారత కోకిలగా పేరుగాంచిన సరోజినీ నాయుడు.  ఈ మహా పోరాట యోధురాలి జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read :Oscars 2025 : ఆస్కార్ అవార్డుల్లో ‘వికెడ్‌’, ‘అనోరా’ హవా.. విజేతలు వీరే

సరోజినీ నాయుడు జీవిత విశేషాలు

  • సరోజినీ నాయుడు 1879  సంవత్సరం ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో జన్మించారు.
  • ఆమె పుట్టిన రోజున (ఫిబ్రవరి 13) భారత ప్రభుత్వం జాతీయ మహిళా దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తోంది.
  • సరోజినీ తండ్రి పేరు అఘోర్ నాథ్ ఛటోపాధ్యాయ్. ఈయన ఇప్పటి బంగ్లాదేశ్‌లో జన్మించారు. అఘోర్ నాథ్ బెంగాలీ హిందువు.
  • నిజాం నవాబు కాలంలో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీకి ప్రిన్సిపల్‌గా అఘోర్ నాథ్ ఛటోపాధ్యాయ్ వ్యవహరించేవారు.
  • అఘోర్ నాథ్ ఎడిన్ బర్గ్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశారు.
  • సరోజినీ(Sarojini Naidu) కూడా ఆరేళ్ల వయసు నుంచే ఆంగ్లంలో కవితలు రాసేది. ఆమెకు పర్షియన్ భాష కూడా వచ్చు.
  • తండ్రి అఘోర్ నాథ్ సహకారంతో మహెర్ మునీర్ పేరుతో ఒక పర్షియన్ నాటకాన్ని సరోజినీ రాశారు. అప్పుడు ఆమె వయసు 12 ఏళ్లు.
  • సరోజినీ నాయుడు తండ్రి నిజాం నవాబుకు బాగా సన్నిహితులు. ఆయన మహెర్ మునీర్ నాటకం పుస్తకాన్ని తీసుకెళ్లి నాటి నిజాం నవాబుకు ఇచ్చారు. దీన్ని చదివి ముగ్ధుడైన నిజాం నవాబు, సరోజినీ నాయుడుకు విదేశాల్లో చదివేందుకు స్కాలర్‌షిప్ ప్రకటించారు. ఈ ఉపకారవేతనంతోనే సరోజినీ నాయుడు లండన్‌లోని కింగ్స్ కాలేజీలో చదువుకున్నారు.
  • లండన్‌లో ఉండగా  పెద్దిపాటి గోవిందరాజులు నాయుడుతో  సరోజినీకి పరిచయం ఏర్పడింది. వాళ్లిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు.  ఆ సమయానికి సరోజిని వయసు 19 ఏళ్లు.
  • పెద్దిపాటి గోవిందరాజులు, సరోజిని దంపతులకు ఐదుగురు సంతానం. వారి కుమార్తె పద్మజ కూడా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.

Also Read :Women’s Day : ఏపీలో మహిళలకు ఉమెన్స్ డే స్పెషల్ గిఫ్ట్

  • 1905లో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ (డబ్ల్యూఏఐ)ను సరోజినీ నాయుడు ప్రారంభించారు.
  • సరోజినీ నాయుడు తొలి కవితా సంకలనం 1905లో ప్రచురితమైంది. దాని పేరు  ‘ది గోల్డెన్ థ్రెషోల్డ్.’
  • 1906లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆమె ప్రసంగించారు.
  • 1925లో ఆమె భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
  • ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు.
  • సరోజినీ నాయుడు భారతదేశపు తొలి మహిళా గవర్నర్. ఆమె 1947 నుంచి 1949 వరకు యునైటెడ్ ప్రావిన్స్ ఆఫ్ ఆగ్రా అండ్‌ ఔద్‌‌కు గవర్నర్‌గా పనిచేశారు.
  • సరోజినీ నాయుడు గౌరవార్ధం దేశంలోని పలు సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులకు ఆమె పేరు పెట్టారు.
  • మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్ల తర్వాత 1949 మార్చి 2న సరోజినీ నాయుడు తన 70వ ఏట ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గుండెపోటుతో కన్నుమూశారు.
  Last Updated: 03 Mar 2025, 08:57 AM IST