Telangana: అక్రమ ఆరోపణలపై కాంగ్రెస్ మౌనం ఎందుకు: రఘునందన్

గత హయాంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు ప్రశ్నించారు

Published By: HashtagU Telugu Desk
Telangana

Telangana

Telangana: గత హయాంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు ప్రశ్నించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో రఘునందన్‌రావు మాట్లాడుతూ పలువురు అధికారులపై తీవ్ర ఆరోపణలు వచ్చినా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన రఘునందన్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఐఏఎస్ అధికారులపై చాలా ఘోషించేవారని , ఇప్పుడు వారిపై చర్యలు తీసుకునే సమయం వచ్చినప్పుడు మౌనం వహిస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మొదటి నుంచి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ రెండు పార్టీలు ఒక నాణానికి బొమ్మబొరుసు లాంటివని రఘునందన్​ రావు అన్నారు. రెండు పార్టీల మధ్య సంబంధం లేకపోతే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డవారిపై రేవంత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

Also Read: Fish Cake: రెస్టారెంట్ స్టైల్ ఫిష్ కేక్ ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోండి ఇలా?

  Last Updated: 30 Jan 2024, 08:59 PM IST