Site icon HashtagU Telugu

Jubilee Hills By Election : ఓటర్ల మద్దతు ఎవరికీ..టెన్షన్ టెన్షన్ అవుతున్న అభ్యర్థులు

Jublihils Campign

Jublihils Campign

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హీట్‌ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ ఎన్నికలను కేవలం ఒక నియోజకవర్గ పోరు అని చెప్పడం సరైంది కాదు, ఇది మూడు ప్రధాన పార్టీల ప్రతిష్ఠాత్మక పోరాటంగా మారింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ఇలా మూడు పార్టీలు తమ సంపూర్ణ బలం ప్రయోగిస్తున్నాయి. ప్రజల నాడిని అర్థం చేసుకోవడానికి వివిధ సర్వే సంస్థలు ప్రయత్నిస్తున్నా, ప్రతి రోజూ ఫలితాలు మారుతూ ఉండటంతో అసలు ఆఖరి దిశ ఏదో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. చాలాచోట్ల సానుభూతి వేవ్ కనిపిస్తుంటే, కొన్నిచోట్ల రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ కూడా కొన్నిమున్సిపల్ వార్డుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ “మహిళా సెంటిమెంట్”పై దృష్టి పెట్టింది. మాగంటి సునీతమమ్మ తరపున మహిళా ఓటర్ల సానుభూతి తమకు అనుకూలంగా ఉందన్న ధీమా కాంగ్రెస్ నాయకుల్లో స్పష్టంగా ఉంది. మరోవైపు, బీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌పై ఉన్న ప్రజా సానుభూతిని వాడుకుంటున్నారు. కేటీఆర్ స్వయంగా బహిరంగంగా మాట్లాడుతూ, “లక్ష ఓట్ల మెజారిటీ సాధించడం అసాధ్యం కాదు” అని ధైర్యంగా చెప్పారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గత ఎన్నికల్లో మూడో స్థానంలో ఉండి డిపాజిట్ కూడా కోల్పోయిన అనుభవం ఉన్నప్పటికీ, ఇప్పుడు విస్తృతమైన గ్రౌండ్‌వర్క్‌తో ముందుకు సాగుతున్నారు. ఈసారి పార్టీ స్థాయిలో అదనపు కృషి కనబడుతోంది.

బీజేపీ అభ్యర్థి లంకలపల్లి దీపక్ రెడ్డి కూడా ఈ సారి బలమైన ప్రచార వ్యూహంతో బరిలో ఉన్నారు. ఆయన ప్రకటనల ప్రకారం, తాను కనీసం 50 వేల మెజారిటీతో గెలుస్తానన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మూడు ప్రధాన పార్టీలూ తమ సొంత సర్వేల్లో విజయం తమకే అని ప్రకటించడం ఓటర్లలో గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇక మరోవైపు, ప్రజలకు ఇష్టమైన అంశాలు, అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్‌లు, స్థానిక అభివృద్ధి అజెండాలు ఎప్పుడు ఎలా ప్రభావం చూపుతాయన్నది చివరి వారంలో స్పష్టమవుతుంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తే, జూబ్లీహిల్స్‌లో గెలుపు–ఓటమి తేడా తాలూకు సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Exit mobile version