Eknath Shinde in Congress: భవిష్యత్తులో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చివేస్తుందా? తెలంగాణకు చెందిన ఏక్నాథ్ షిండే పాత్రను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోషించారా? ఈ వాదన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. తాజాగా తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కోమటిరెడ్డి కలిశారని సంచలన కామెంట్స్ చేశారు.
కోమటిరెడ్డి తాజాగా.. ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై మహేశ్వర్రెడ్డి అసలు విషయాన్నీ ప్రస్తావించారు. కోమటిరెడ్డి తాజాగా కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయినట్లు ఆయన అన్నారు. తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ నేతలు వివిధ అంశాలను ప్రస్తావిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజారిటీ తక్కువగా ఉండడం, మరియు ఐదుగురు మంత్రులు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు. ఒకరిపై ఎవరికీ నమ్మకం లేదని, తగిన సమయంలో సీఎం రేవంత్రెడ్డిని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను ముట్టుకోగల దమ్ముంటే రాష్ట్రంలో 48 గంటల్లో ప్రభుత్వం కూలిపోతుందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఐదుగురు మంత్రులు బీజేపీతో టచ్లో ఉన్నారనే విషయం రేవంత్కే తెలియాలని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే ప్రజల ఆదేశాన్ని గౌరవించే బిజెపి ఈ చర్యను ప్రోత్సహించలేదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తున్నారని అన్నారు. రాజీనామాలు చేయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నందుకు బీఆర్ఎస్పై అప్పట్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ విమర్శించిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. కానీ ఇప్పుడు అదే పని చేస్తూ ఇతర నేతలను తన పార్టీలోకి లాగుతున్నారని చెప్పారు.
Also Read: Uber Bill Viral : ఉబెర్తో ఆటో రైడ్.. బిల్లు రూ.7.66 కోట్లు.. ప్రయాణికుడికి షాక్