Whats Today : ఇవాళ హైదరాబాద్లో రాష్ట్రపతి పర్యటించనున్నారు. రాష్ట్రపతి నిలయానికి ద్రౌపది ముర్ము రానున్నారు. రాష్ట్రపతి రాకతో హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. సాయంత్రం 6.25 గంటలకు హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి వెళ్తారు. అక్కడి నుంచి అల్వాల్, లోతుకుంట మీదుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకుంటారు.
We’re now on WhatsApp. Click to Join.
- సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్పై ఇవాళ(Whats Today) విచారణ జరుగుతుంది. దీంతో హైకోర్టు ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
- ఇవాళ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇసుక పాలసీలో అక్రమాలు, ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్స్ కోసం చంద్రబాబు పిటిషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత దీనిపై విచారణ జరుగుతుంది.
- టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. విశాఖకు చేరుకున్న యాత్ర నేడు పరిసమాప్తం కానుంది. ఎల్లుండి బహిరంగ సభతో యాత్రను లోకేష్ పూర్తిగా ముగించనున్నారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది.
- ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట కార్మిక సంఘాలు ధర్నా చేయనున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జిందాల్ తో కుదుర్చుకున్న రహస్య ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేయనున్నాయి.
- వారణాసిలో రెండో రోజు (ఇవాళ) ప్రధాని మోడీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
- ఇవాళ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలోని 5వ అంతస్తులో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
Also Read: Nominated Posts : 50కిపైగా నామినేటెడ్ పోస్టులు.. 6 ఎమ్మెల్సీ స్థానాలు.. ప్రయారిటీ ఎవరికి ?