Site icon HashtagU Telugu

Whats Today : తెలంగాణలో ప్రధాని మోడీ ప్రచారం.. నర్సాపూర్‌కు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

Whats Today

Whats Today

Whats Today : ఇవాళ తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 10.25 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 11.30 హకీంపేట‌కు చేరుకుంటారు. హకీంపేట నుంచి 12.35 గంటలకు మోడీ మహబూబాబాద్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.25 వరకు 40 నిమిషాలపాటు సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.35 గంటలకు మహబూబాబాద్‌ నుంచి బయలుదేరి 2.30 గంటలకు మోడీ కరీంనగర్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.45 నుంచి 3.25 గంటల వరకు కరీంనగర్ సభలో పాల్గొంటారు. కరీంనగర్ సభ తర్వాత సాయంత్రం 4.35 గంటలకు మోడీ హైదరాబాద్ విమానాశ్రయనికి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు హైదరాబాద్ రోడ్డు షోలో మోడీ పాల్గొంటారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Israel Deal : హమాస్ చెరలో మరో 200 మంది.. సీజ్ ఫైరా ? యుద్ధమా ?