Site icon HashtagU Telugu

Vishnu Deo Sai : తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ రహితంగా మార్చాలి – చత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి

Vishnu Dev Sai

Vishnu Dev Sai

తెలంగాణ లో అవినీతిని నిర్మూలించి..తెలంగాణ కాంగ్రెస్ రహితంగా మార్చాలని ప్రజా సంకల్ప యాత్ర లో పిలుపునిచ్చారు చత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు స్థానాల్లో విజయం సాధించిన బిజెపి..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణాలో పదికి పైగా పార్లమెంట్ సీట్లలో గెలుపే లక్ష్యంగా సమరశంఖం పూరించింది. ఈ మేరకు ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారు. ఈరోజు ఆదివారం మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో జరిగిన ఈ యాత్రలో (Chhattisgarh CM) విష్ణుదేవ్‌ సాయ్‌ (Vishnu Deo Sai) పాల్గొన్నారు. భద్రాద్రి నుంచి భారత్ విజయ సంకల్ప యాత్ర ను ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఆయన భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి, కాషాయ వస్త్రం కప్పుకుని ఆలయంలో లోపలికి వెళ్లిన విష్ణుదేవ్‌ సాయ్ సీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్థానిక మార్కెట్ కమిటీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్ల పాటు బీజేపీ నిరంతరాయంగా పాలిస్తూ వస్తుంది. బిజెపి పాలన లో రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాష్ట్ర ప్రగతిని అడ్డుకుందన్నారు. 2023లో ఛత్తీస్‌గఢ్ ప్రజలు కాంగ్రెస్‌ను ఓడించి బిజెపికి పట్టం కట్టడం ద్వారా మళ్లీ ఆదివాసీని ముఖ్యమంత్రిని చేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు మాత్రమే అయిందని, ఇంత తక్కువ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గత ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో 18 లక్షలకు పైగా పేద కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని, వారికి ఇళ్ల స్థలాలతో పాటు రూ.లక్ష బోనస్ ఇచ్చాం అన్నారు. 12 లక్షల మందికి పైగా రైతులకు రెండేళ్లుగా 3716 కోట్లు. రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చామని, ఇప్పుడు రాష్ట్రంలోని రైతుల నుంచి రూ.10కి బియ్యం కొనుగోలు చేస్తున్నాం. క్వింటాల్‌కు 3100, ఎకరాకు 21 క్వింటాళ్ల బియ్యాన్ని సేకరిస్తుందని తెలిపారు.

ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అని సీఎం విష్ణు అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుండి అవినీతిని నిర్మూలించి, రాష్ట్రాన్ని మొత్తం కాంగ్రెస్ రహితంగా మార్చాలి.. అప్పుడే భారతదేశం మళ్లీ ప్రపంచ గురువు అవుతుంది, మనమందరం అభివృద్ధి చెందుతాము అని తెలిపారు. 2045 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని మన ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్నారని, ఆర్థిక కోణంలో 10 ఏళ్లలో 11వ స్థానంలో ఉన్న మన దేశాన్ని మన ప్రధాని 5వ స్థానానికి చేర్చారని ప్రశంసించారు. 2045 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని, దీనికి అందరి మద్దతు మరియు ఆశీర్వాదాలు తప్పనిసరి అని పేర్కొన్నారు.

Read Also : IND vs ENG 4th Test: గెలుపు దిశగా టీమిండియా… ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టిన స్పిన్నర్లు

Exit mobile version