ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(Ramoji Rao) మరణం ఫై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతు రావు (V Hanumantha Rao ) కీలక వ్యాఖ్యలు చేసారు. రామోజీ రావు ది సాధారణ మరణం కాదని..ఆయన్ను హింసించి చంపేశారని పేర్కొన్నారు. రామోజీ రావు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసి సినీ , రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. రేపు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక కడసారి రామోజీరావు ను చూసేందుకు అన్ని మీడియా చానెల్స్ అధినేతలతో పాటు సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివస్తు నివాళ్లు అర్పిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్(హనుమంతరావు) రామోజీరావు పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామోజీరావు సాదరణంగా చనిపోలేదని.. ఆయన్ను మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసుల పేరుతో హింసించి హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇలా చేయడం దారుణమని..వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తాను ఆనాడే వ్యతిరేకించానని.. తెలిపారు. జగన్ ప్రభుత్వం రామోజీరావును హింసించినందువల్లే ఆయన అనారోగ్యానికి గురయ్యారని.. ఇది ముమ్మాటికీ హత్యే అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా గత ప్రభుత్వమే రామోజీరావును హింసించిందని.. 88 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తి ఎమర్జేన్సీ బెడ్ పై చికిత్స పొందుతున్నప్పటికి విచారణ పేరుతో రాజకీయం చేశారని.. వారికి దేవుడు తగిన బుద్ది చెప్పారని.. తనను హింసకు గురి చేసిన వ్యక్తి అంతం చూసాకే రామోజీరావు కన్నుమూశారని జగన్ ఫై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.
Read Also : Ramoji Rao Death: రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని రాజమౌళి డిమాండ్