UPSC Civil Services Exam Result 2023: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023లో తెలంగాణలోని మహబూబ్నగర్కు చెందిన డోనూరు అనన్యారెడ్డి మూడవ ర్యాంక్ సాధించారు. ఆదిత్య శ్రీనివాస్ అగ్రస్థానంలో నిలిచారు. యూపీఎస్సీ మంగళవారం ఫలితాలను ప్రకటించింది. పరీక్ష ఫలితాల కోసం UPSC వెబ్సైట్ని సందర్శించవచ్చు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) మరియు ఇతర సర్వీసుల్లో నియామకం కోసం UPSC 1,016 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది.
We’re now on WhatsApp. Click to Join
UPSC సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్ష 2023 మే 28న జరిగింది. వాటిని క్లియర్ చేసిన అభ్యర్థులు సెప్టెంబర్ 15, 16, 17, 23, మరియు 24 తేదీల్లో రెండు షిఫ్టులలో అంటే ఉదయం 9 నుండి 12 గంటల వరకు జరిగిన మెయిన్స్కు హాజరయ్యారు. మరియు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ జరిగింది. కాగా యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు డిసెంబర్ 8న వెలువడ్డాయి. 2023 సివిల్ సర్వీస్ పరీక్ష ఇంటర్వ్యూలు మరియు వ్యక్తిత్వ పరీక్షలు జనవరి 2 మరియు ఏప్రిల్ 9 మధ్య దశలవారీగా జరిగాయి.
Also Read: Telangana BJP : తెలంగాణ లో బిజెపి గ్రాఫ్ పెరిగిందంటున్న సర్వేలు..