Hyderabad: హైదరాబాద్​లో అమానుషం.. కాగితాలు ఏరుకునే మహిళపై అత్యాచారం

హైదరాబాద్ లో అమానుషం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం చిత్తు పేపర్లు ఏరుకుంటూ బ్రతుకు జీవనం సాగిస్తున్న ఓ మహిళపై ఇద్దరు ఆగంతకులు అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు మృతి చెందింది.

Hyderabad: హైదరాబాద్ లో అమానుషం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం చిత్తు పేపర్లు ఏరుకుంటూ బ్రతుకు జీవనం సాగిస్తున్న ఓ మహిళపై ఇద్దరు ఆగంతకులు అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు మృతి చెందింది. అయితే సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు నిందితుల కదలికలను గుర్తించారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని మూసాపేట వై జంక్షన్ సమీపంలో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం..మూసాపేట వై జంక్షన్ సమీపంలో మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. మహిళ మృతదేహం పక్కన చిత్తు కాగితాలతో ఓ సంచి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి బట్టలు చింపి అత్యాచారానికి పాల్పడ్డట్లు పేర్కొన్నారు. రక్తస్రావం కావడంతో అత్యాచారం జరిగినట్లు గుర్తించామన్నారు. ఘటనాస్థలికి సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు బాధితురాలితో మాట్లాడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. మహిళను ఓ వాణిజ్య భవనం వెనుకకు తీసుకెళ్లినట్లు ఫుటేజిలో కనిపించింది. దారుణానికి పాల్పడిన అనంతరం వారిద్దరూ బైక్‌పై కూకట్‌పల్లి వైపు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.

We’re now on WhatsAppClick to Join

విష్ణుప్రియ లాడ్జి పక్కనే ఉన్న సందులో ఆమెను బలవంతంగా లాక్కెళ్లారని, కొంతసేపటి తర్వాత యువకులిద్దరూ బైక్‌పై కూకట్‌పల్లి వైపు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. వేలిముద్రల నిపుణులు, ఇతర బృందం సభ్యులు పలు ఆధారాలు సేకరించినట్లు కూకట్‌పల్లి ఏసీపీ కె.శ్రీనివాసరావు, సీఐ కృష్ణమోహన్‌ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని వివరించారు.

Also Read: Prabhas : సినిమా ప్లాప్ అయితే ప్రభాస్ ఏం చేస్తాడో తెలుసా..?