ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు (జూలై 8న) వరంగల్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని బీజేపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. బీజేపీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో అంతర్గత పోరు తెరపైకి వచ్చింది. జిల్లాలోని నరసంపేట నియోజకవర్గంలో ఇద్దరు సీనియర్ నేతల గ్రూపులు బహిరంగంగా ఘర్షణకు దిగాయి. సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సమక్షంలో వాగ్వాదం ప్రారంభమై తీవ్ర వాగ్వాదానికి దిగడంతో రేవూరి ప్రకాష్రెడ్డి, రాణాప్రతాప్ మద్దతుదారులు పార్టీ కార్యాలయంలో పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బీజేపీ కార్యాలయం కూడా ధ్వంసమైంది. రేపు (జులై 8న) వరంగల్లో జరిగే బహిరంగ సభకు జన సమీకరణ విషయంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఘర్షణ మొదలైంది. ఘర్షణకు దిగిన గ్రూపులు ఫర్నీచర్ను ధ్వంసం చేయడంతోపాటు కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కాషాయ పార్టీకి తలవంపులు తెచ్చింది.
Telangana BJP : వరంగల్ లో బీజేపీ నేతల బాహాబాహీ.. ప్రధాని పర్యటనకు ముందు బయటపడ్డ విభేదాలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు (జూలై 8న) వరంగల్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని బీజేపీ నేతల

Bjp Another 6
Last Updated: 07 Jul 2023, 10:10 AM IST