Turmeric Board : కాసేపట్లో పసుపు బోర్డు ప్రారంభం

Turmeric Board : సంక్రాంతి పర్వదినాన, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డును వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు

Published By: HashtagU Telugu Desk
Turmeric Board In Nizamabad

Turmeric Board In Nizamabad

తెలంగాణ రైతులకు మరింత ఉత్సాహాన్నిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌(Nizamabad)లో పసుపు బోర్డు (Turmeric Board) ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పర్వదినాన, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డును వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. పసుపు రైతులకు ఇది ఎంతోకాలంగా ఎదురు చూపిన చారిత్రాత్మక రోజు. తెలంగాణలో పసుపు పంట ముఖ్యమైనది. కానీ పసుపు పంటకు న్యాయమైన ధర దక్కక, మార్కెటింగ్ సదుపాయాలు లేక రైతులు చాలాకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. 15 ఏళ్లుగా రైతులు పసుపు బోర్డు ఏర్పాటు కోసం పోరాటం చేస్తూ వస్తున్నారు. కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చడం ద్వారా రైతుల కల నెరవేరిందని భావిస్తున్నారు.

Cockfighting : కోడిపందాల్లో ఉద్రిక్తత.. పగిలిన తలలు

పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని కేంద్రం నియమించింది. ఆయన ఈ రంగానికి చెందిన అనుభవజ్ఞుడు. బోర్డు కార్యకలాపాలు పసుపు రైతుల అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని, మార్కెటింగ్, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం అవుతోంది. పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా పసుపు రైతులకు అధిక మద్దతు ధరలు, గ్లోబల్ మార్కెట్‌కు చేరువయ్యే అవకాశం కలుగుతాయి. కేంద్రం ఈ బోర్డును ప్రత్యేకంగా నిధులు, విధానాలతో సమర్ధంగా నడిపేందుకు పునాదులు వేసింది. మార్కెటింగ్ అవకాశాల మెరుగుదలకు ఈ బోర్డు కీలకంగా మారనుంది. పసుపు బోర్డు ఏర్పాటుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ప్రాంత రైతులకు ఇది కొత్త ఆర్థిక దిశను తెస్తుందని, వారి జీవన ప్రమాణాలను పెంపొందించనున్నదని పండితులు అభిప్రాయపడుతున్నారు. రైతుల త్యాగాలు ఫలించి ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవడం పట్ల రైతు సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.

  Last Updated: 14 Jan 2025, 10:50 AM IST