Makar Sankranti 2024: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చిన్నారుల నుంచి యువకుల వరకు అందరికీ గుర్తుకు వచ్చేది పతంగులు ఎగురవేయడం. అలాంటి పండుగ ఆనందంగా జరుపుకోవాలే తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. కైట్స్ కారణంగా పక్షులు మరణాలు సంభవిస్తాయి. కొన్ని సందర్భంలో మనుషులు విద్యుత్ ఘాతుకానికి గురవుతున్నారు. పతంగులు ఎగరేసే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL).
లోహపు పూతతో కూడిన ‘మాంజా’ దారాన్ని ఉపయోగించడం వల్ల సంభవించే సంభావ్య పరిణామాల గురించి డిపార్ట్మెంట్ ప్రజలను హెచ్చరించింది. ఇది విద్యుత్ షాక్కు మరియు కరెంట్ ట్రిప్పింగ్కు కారణమవుతుందని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పేర్కొంది TSSPDCL ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ విద్యుత్ షాక్కు కారణమయ్యే లోహపు పూతతో కూడిన ‘మాంజా’ను ఉపయోగించకుండా ఉండాలని ప్రజలను కోరారు.కాటన్, నార లేదా నైలాన్ తీగను మాత్రమే ఉపయోగించండని చెప్పారు. మెటాలిక్ థ్రెడ్ లేదా మెటల్ రీన్ఫోర్స్డ్ స్ట్రింగ్ను ఎప్పుడూ ఉపయోగించవద్దు. లోహపు పూతతో కూడిన దారం విద్యుత్ వాహకం. అది విద్యుత్ వైర్లను తాకినప్పుడు లేదా దగ్గరగా వచ్చినప్పుడు విద్యుత్ షాక్కు కారణం కావచ్చని సంస్థ ఎండీ అభిప్రాయపడ్డారు.
గాలిపటాలు విద్యుత్ లైన్లలో చిక్కుకున్నప్పుడు లేదా సబ్స్టేషన్ ఆవరణలో పడిపోతే వాటిని తొలగించడానికి ప్రయత్నించవద్దని ఆయన ప్రజలను హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా ప్రజలు తమ తమ ప్రాంతాల్లోని విద్యుత్ లైన్లలో ఏవైనా గాలిపటాలు లేదా ఇతర వస్తువులు ఇరుక్కుపోయినట్లయితే విద్యుత్ శాఖకు లేదా సమీపంలోని విద్యుత్ కార్యాలయానికి లేదా మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్సైట్ (www.tssouthernpower.com) ద్వారా తక్షణమే తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు.
Also Read: Teja Sajja: మంచి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారనేదానికి హను-మాన్ నిదర్శనం