Site icon HashtagU Telugu

TSRTC : శ్రీశైలానికి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ప్రారంభించ‌నున్న టీఎస్ఆర్టీసీ

Telangana RTC

Tsrtc

మహా శివరాత్రి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 390 బస్సులను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ  దృష్ట్యా ప్రత్యేక బస్సు సర్వీసుల‌ను ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 19 వరకు ప్రారంభించనున్నారు. ఈ బస్సులు నగరం నుండి MGBS, JBS, దిల్‌సుఖ్‌నగర్, I.S.సదన్, KPHB, BHEL మరియు ఇతర ప్రాంతాల నుండి ప్రారంభమవుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సు కేటగిరీలను బట్టి శ్రీశైలానికి ప్రయాణించే టికెట్ ధ‌ర‌లు ఉంటాయ‌ని అధికారులు తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సులో ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు రూ.600, డీలక్స్ రూ.540, ఎక్స్‌ప్రెస్‌కు రూ.460.లుగా ఉండ‌నున్నాయి. అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి శ్రీశైలానికి సూపర్ లగ్జరీకి రూ.650, డీలక్స్‌కు రూ.580, ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.500గా నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం, ప్రయాణికులు 9959226248, 9959226248, 9959226257 (MGBS), 9959226246, 040-27802203 (JBS); 9959226250 (I.S.సదన్) మరియు 9959226149 (KPHB మరియు BHEL) నంబర్‌లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. శ్రీశైలం వెళ్లే ప్ర‌యాణికులు టీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌లో టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.