Group 1 Alert : తెలంగాణలో గ్రూప్-1 పోస్టులకు అప్లై చేసిన వారికి కీలకమైన సమాచారం ఇది. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు ఈరోజు నుంచి మార్చి 27 వరకు అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మార్చి 27న సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులోని వివరాలను అభ్యర్థులు మార్చుకోవచ్చు. వెబ్సైట్ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ లేదా నేరుగా వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఏయే అంశాలనైతే ఛేంజ్ చేస్తారో.. వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను తప్పనిసరిగా పీడీఎఫ్ ఫార్మాట్లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈదఫా ఒక్కసారి వివరాలను సవరించిన తర్వాత.. మరోసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వరు. అభ్యర్థులు తమ పేరు, పుట్టినతేదీ, జెండర్, విద్యార్హతలు, ఫోటో, సంతకం తదితర వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తుల్లో ‘Un- Employee’ స్టేటస్ నుంచి ‘Employee’ కిందికి మార్చుకోవాలంటే పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. గ్రూప్-1కు మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్లు..
గ్రూప్-1లోని మొత్తం 563 పోస్టులకుగానూ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు 140, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) పోస్టులు 115 ఉన్నాయి. మొత్తం 150 మార్కులకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), 900 మార్కులకు మెయిన్స్ (6 పేపర్లు) పరీక్ష జరుగుతాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి. ఇక మెయిన్ పరీక్షలో 150 మార్కులకు జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష నిర్వహిస్తారు.