తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంబేద్కర్ దార్శినికతతోనే తెలంగాణ వచ్చిందని భావిస్తోన్న ఆయన కొత్త సచివాలయ నామకరణం నిర్థారించారు. ఆ మేరకు చీఫ్ సెక్రటరీకి ఆదేశించారు.ఇటీవల కొత్త పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. అంతేకాదు, తెలంగాణ అసెంబ్లీ కూడా ఆమేరకు తీర్మానం చేసింది. ఇదే తరుణంలో కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరును ఖరారు చేయడం గమనార్హం.
నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును పెట్టాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. pic.twitter.com/hKr6N2rYqO
— Telangana CMO (@TelanganaCMO) September 15, 2022
Breaking :
Government of Telangana decides to name the new Telangana Secretariat Building after Babasaheb Dr BR Ambedkar …Jai Bhim .
Thank You #KCR sir
— krishanKTRS (@krishanKTRS) September 15, 2022
దేశంలోనే ఎత్తైనా అంబేద్కర్ విగ్రహం నిర్మాణం జరుగుతోంది. ఎన్టీఆర్ ఘాట్ సమీపంలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక సందర్శన ప్లేస్ గా డిజైన్ చేశారు. రాబోవు ఎన్నికల నాటికి సామాజిక సమీకరణాలను చూసుకుంటోన్న కేసీఆర్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఫలితాలను ఇస్తుందని ఆశించడం సర్వసాధారణం.