TS : విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్…!!

తెలంగాణలో ఉద్యోగుల పరస్పర బదిలీ ( మ్యూచువల్ ట్రాన్స్ ఫర్)లకు రాష్ట్ర సర్కార్ సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - June 20, 2022 / 03:50 PM IST

తెలంగాణలో ఉద్యోగుల పరస్పర బదిలీ ( మ్యూచువల్ ట్రాన్స్ ఫర్)లకు రాష్ట్ర సర్కార్ సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ కింద ఉపాధ్యాయులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన వెంటనే …విద్యాశాఖలో ఉపాధ్యాయులు పరస్పర బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆ శాఖ అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 2558 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. విద్యాశాఖ మంత్రి ఆదేశాలతో ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి.