BJP MP Arvind: బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడి!

ఎన్నికలకు ముందే తెలంగాణ రాజకీయాలు చాలా రంజుగా మారుతున్నాయి. ముఖ్యంగా నువ్వానేనా అన్నట్టుగా టీఆర్ఎస్, బీజేపీ నాయకులు

  • Written By:
  • Updated On - November 18, 2022 / 12:59 PM IST

ఎన్నికలకు ముందే తెలంగాణ రాజకీయాలు చాలా రంజుగా మారుతున్నాయి. ముఖ్యంగా నువ్వానేనా అన్నట్టుగా టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అరవింద్ కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కవిత కాంగ్రెస్ లోకి వెళ్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) కార్యకర్తలు శుక్రవారం బంజారాహిల్స్‌లో నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై దాడి చేశారు. దాడి జరిగిన సమయంలో అరవింద్ నిజామాబాద్‌లో ఉన్నారు.  బీజేపీ ఎంపీ ఇంటి ముందు కూడా టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కుమార్తె కవిత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపారని ఎంపీ అరవింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే కవితను ప్రలోభపెట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని కేసీఆర్ బయటపెట్టారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అరవింద్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రిపై అసంతృప్తితోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని అరవింద్ ఆరోపించారు. ఇవాళ కవిత మీడియా ముందుకొచ్చి అరవింద్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.