Site icon HashtagU Telugu

TRS: ఉప రాష్ట్రపతి ఎన్నికపై కేసీఆర్ వైఖరేమిటో!

CM kcr and telangana

CM KCR Telangana

ఉపరాష్ట్రపతి ఎన్నికపై టీఆర్‌ఎస్ తన వైఖరిని త్వరలోనే స్పష్టం చేయనుంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఓటమి నేపథ్యంలో టీఆర్‌ఎస్ పలు అవకాశాలను పరిశీలిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికపై మరో రెండు రోజుల్లో టీఆర్‌ఎస్‌ తన వైఖరిని స్పష్టం చేస్తుందని పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్‌ కే కేశవరావు తెలిపారు. పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రత్యర్థి పార్టీ ఏకగ్రీవ అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

అయితే తృణమూల్ కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాన్ని విమర్శిస్తూ తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఎన్నికల ప్రక్రియకు దూరం కావడానికి టీఆర్‌ఎస్ కూడా తృణమూల్ కాంగ్రెస్ బాటనే అనుసరించవచ్చు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని పలువురు ఎంపీలు సూచించినట్టు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో టీఆర్ఎస్ వైఖరి ఏమిటి అనేది స్పష్టమయ్యే అవకాశాలున్నాయి.