తెలంగాణ గవర్నర్ తమిళ సై వ్యవహారాన్ని మరోసారి టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. ఢిల్లీ కేంద్రంగా ఆమె సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని చేసిన కామెంట్స్ పై ఫైర్ అవుతున్నారు. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై టిఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. సీఎంపై గవర్నర్ ‘రాజకీయ వ్యాఖ్యలు’ చేయడాన్ని మంత్రి జగదీష్ రెడ్డి తప్పుబట్టారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాల్లోకి రారని, ముందస్తు ఎన్నికలకు వెళ్లరని గవర్నర్ మీడియా ముందు చేసిన వ్యాఖ్యల్ని అభ్యంతర పెట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు ఇది అవాంఛనీయమని జగదీశ్ రెడ్డి అన్నారు. “గవర్నర్కు కొన్ని పరిమితులు ఉన్నాయి, కానీ ఆమె అన్ని పరిమితులను దాటింది.` అంటూ దుయ్యబట్టారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, కే. వివేకానంద్, ముటా గోపాల్, జాజుల సురేందర్, నోముల భగత్ గవర్నర్, ఈటల రాజేందర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “గవర్నర్ బిజెపి నాయకుడిలా ప్రవర్తిస్తున్నారు. ఆమె రాజ్భవన్ను రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చారు” అని ఆరోపించారు. సిఎంను లక్ష్యంగా చేసుకుని క్లౌడ్బర్స్ట్పై వ్యంగ్య వ్యాఖ్యలు చేసినందుకు గవర్నర్పై మండిపడ్డారు.
సీఎం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ రాజేందర్ చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ నేత రాజేందర్ విమర్శించారు. హుజూరాబాద్లో ఓటమి భయంతోనే ఈటల పెద్దఎత్తున ప్రకటనలు చేస్తున్నారు.కాంగ్రెస్ అండతో రాజేందర్ హుజూరాబాద్ నుంచి గెలిచారని ఆరోపించారు. పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని, ఆగస్టులో బీజేపీలో చేరతారని రాజేందర్ చేసిన ప్రకటనను టీఆర్ఎస్ నేతలు ఖండించారు.‘‘టీఆర్ఎస్ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా చేస్తున్న సర్వేలన్నీ 2023లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని స్పష్టంగా చెబుతున్నాయి. అసెంబ్లీలో సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమయ్యే బీజేపీలో ఎవరు చేరతారు? కాంగ్రెస్ ఇప్పటికే చచ్చిపోయింది అంటూ టీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకు రావడంతో గవర్నర్ కార్యాలయం మరోసారి రాజకీయ రచ్చలోకి వచ్చింది.