మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. బీజేపీపై టీఆర్ఎస్ 10,297 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.
ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. మునుగోడు.. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరి, ఈ ఉప ఎన్నికలో పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీపడ్డారు. అయితే, బీజేపీ రెండో స్థానం దక్కించుకుంది. కాంగ్రెస్ నిర్ణీత ఓట్లు కూడా సాధించకపోవడంతో డిపాజిట్ కోల్పోయింది. రాజగోపాల్ రెడ్డి తన సిట్టింగ్ స్థానాన్ని గెలవలేకపోయారు.
మునుగోడు ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు.#MunugodeWithTRS pic.twitter.com/D6Scg6YUBn
— TRS Party (@trspartyonline) November 6, 2022
రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఓట్ల లెక్కింపులో ముందు నుంచి టీఆర్ఎస్ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. రెండు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగింది. కాంగ్రెస్ ఎక్కడా కనీసం పోటీ ఇవ్వలేకపోయింది.
Many congratulations to @Koosukuntla_TRS Garu on being elected as the MLA of Munugodu
Thanks to the people of Munugodu for reposing faith in TRS party & Hon’ble CM KCR’s leadership 🙏
As promised, will adopt the constituency & work towards expeditious progress of pending works pic.twitter.com/mAmtddXaf4
— KTR (@KTRTRS) November 6, 2022
The result of ‘Munugode’ is a right & tight slap on the face of ‘Amit shah & Modi’ ✊
Telangana is with KCR & along with him in the fight against #ModiGovt pic.twitter.com/ytyDMovTmx
— YSR (@ysathishreddy) November 6, 2022