పరిపాలనా అవసరాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లను జిల్లా రెవెన్యూ అధికారులు (డీఆర్వోలు), భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు (ఎస్డీసీలు)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. మంచిర్యాల డీఆర్వోగా నిర్మల్ తహసీల్దార్ ఎ. మోతీరామ్, పెద్దపల్లి డీఆర్వోగా కరీంనగర్కు చెందిన బి. రాజేశ్వరి, జగిత్యాల డీఆర్వోగా పెద్దపల్లికి చెందిన ప్రసాద్ నియమితులయ్యారు. ఇతర బదిలీల్లో వనపర్తి నుంచి నాగర్కర్నూల్కు ఆర్. పాండు, ఖమ్మం నుంచి ములుగుకు వి. రవికుమార్, మేడ్చల్-మల్కాజ్గిరి నుంచి కరీంనగర్కు జె. స్వామి, నాగర్కర్నూల్ నుంచి కామారెడ్డికి ఎ. పాండు బదిలీ అయ్యారు. అలాగే సిద్దిపేట ఎస్డీసీగా ఎం. సుదర్శన్రెడ్డి, నల్గొండ ఎస్డీసీగా ఎం. రమాదేవి, సిరిసిల్ల ఎస్డీసీగా జి. కుమారస్వామి, కరీంనగర్ ఎస్డీసీ (భూసేకరణ)గా ఎన్. వెంకట్రెడ్డి నియమితులయ్యారు. ఈ బదిలీలకు సంబంధించిన పూర్తి నివేదికలను వెంటనే సమర్పించాలని ప్రభుత్వం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA), జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
పరిపాలనా అవసరాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లను జిల్లా రెవెన్యూ అధికారులు (డీఆర్వోలు), భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు (ఎస్డీసీలు)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. మంచిర్యాల డీఆర్వోగా నిర్మల్ తహసీల్దార్ ఎ. మోతీరామ్, పెద్దపల్లి డీఆర్వోగా కరీంనగర్కు చెందిన బి. రాజేశ్వరి, జగిత్యాల డీఆర్వోగా […]

Transfers
Last Updated: 27 May 2026, 07:40 PM IST