Telangana : విషాదం… పరుగెడుతూ గుండెపోటుతో ఎస్సై అభ్యర్థి మృతి…!!

  • Written By:
  • Updated On - November 16, 2022 / 10:23 AM IST

ఎలాగైన పోలీసు ఉద్యోగం సాధించాలన్న తపన. దాని కోసం అహర్నిశలు కష్టపడటం. తన కలను నెరవేర్చుకునే క్రమంలో ఓ ఎస్సై అభ్యర్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన సూర్యపేట జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. మ్రుతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…ఇందిరమ్మ కాలనీకి చెందిన శ్రీకాంత్ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు. ఇప్పుడు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టు కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రతిరోజూ స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో సాధన చేస్తుంటాడు.

రోజుమాదిరిగానే మంగళవారం కూడా గ్రౌండ్ లో పరుగులు తీస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారి గుండెలో నొప్పిరావడంతో కుప్పకూలాడు. చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే శ్రీకాంత్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. త్వరలో ఎస్సైగా తనకు కొడుకును చూస్తామనుకున్న తల్లిదండ్రులకు కన్నకొడుకు ఇలా మరణించడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.