హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై శనివారం ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసు విభాగం శుక్రవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంతో తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
దీనిలో భాగంగానే శనివారం ట్యాంక్ బండ్ పై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కారణంగా ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని వాహనాదారులు గుర్తుంచుకుని ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30ల వరకు ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లాలనుకునే వారు ప్రత్యామ్యాయ మార్గాల ద్వారా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
#HYDTPinfo
Commuters, please make a note of traffic restrictions/diversions in connection with the Release of Tricolored Balloons programme in view of Swatantra Bharata Vajrostavalu at Upper Tankbund, Hyd., on 13-08-2022.@JtCPTrfHyd pic.twitter.com/LnA4MOuT7I— Hyderabad Traffic Police (@HYDTP) August 12, 2022