Revanth Reddy: బల్మూరు వెంకట్ కు రేవంత్ పరామర్శ

సిద్దిపేటలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - June 30, 2022 / 03:00 PM IST

సిద్దిపేటలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్తున్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో వెంకట్ అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్ తనతో పోలీసులు వ్యవహరించిన తీరును రేవంత్ రెడ్డికి వివరించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని వెంకట్ కు రేవంత్ రెడ్డి ధైర్యం చెప్పారు.