సిద్దిపేటలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్తున్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో వెంకట్ అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్ తనతో పోలీసులు వ్యవహరించిన తీరును రేవంత్ రెడ్డికి వివరించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని వెంకట్ కు రేవంత్ రెడ్డి ధైర్యం చెప్పారు.
TSNSUI president @VenkatBalmoor was brutally attacked by the police yesterday making him hospitalised.
I strongly condemn this attack and demand immediate action on police personnel involved. pic.twitter.com/iTAtlYySRr
— Revanth Reddy (@revanth_anumula) June 30, 2022