విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి సిన్హాకు స్వాగతం పలికే విషయంలో తెలంగాణ పీసీసీ డైలమాలో పడింది. ఒక వేళ బేగంపేట విమానాశ్రయంకు టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి వెళితే రాజకీయంగా నష్టపోతామనే భావన పీసీసీ చీఫ్ రేవంత్ లో ఉంది. అందుకే, టీఆర్ఎస్ వేదికను ముందుగా పంచుకుంటే గాంధీభవన్ వేదికను పంచుకోమని పరోక్షంగా రేవంత్ రెడ్డి సంకేతం ఇచ్చారు. కానీ, ఏఐసీసీ ఇచ్చే డైరెక్షన్ మేరకు నడుచుకుంటామని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క్ అంటున్నారు.
సిన్హాను స్వాగతించే విషయంలో రేవంత్ రెడ్డి, మల్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వద్దకు ముందుగా సిన్హా రావాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ వేదికను పంచుకోవాలని సూచిస్తున్నారు. కానీ, షెడ్యూల్ ప్రకారం భారీ ర్యాలీకి టీఆర్ఎస్ పార్టీ ప్రణాళికను రచించింది. అంతేకాదు, సిన్హాను విమానాశ్రయం వద్దకు వెళ్లి ఆహ్వానించడానికి కేసీఆర్ సిద్ధం అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్, అసరుద్దీన్ కూడా కేసీఆర్ తో కలిసి విమానాశ్రయానికి వెళతారా? అనే సందిగ్ధం నెలకొంది.
రాష్ట్రపతి ఎన్నికల సమయంలో బిజెపిని ఒంటరి చేసే ప్రయత్నంలో యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని టిఆర్ఎస్ పార్టీ ఆమోదించింది. హైదరాబాద్కు స్వాగతం పలికింది. జులై 2న ప్రత్యర్థి పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా, ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరూ యాదృచ్ఛికంగా వివిధ సందర్భాల్లో హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మద్దతు తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య రాజకీయ పోటీ నెలకొనడంతో యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకాలా వద్దా అనే విషయంలో టీపీసీసీ నేతలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
యశ్వంత్ సిన్హాను స్వాగతించాలా వద్దా అనే అంశంపై తెలంగాణ కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. యశాంత్ సిన్హా టీఆర్ఎస్ సమావేశానికి హాజరైతే గాంధీభవన్లో వేదిక పంచుకోబోమని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి గురువారం స్పష్టం చేశారు. యశ్వంత్ సిన్హా మొదట టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ రెండవదిగా కలవాలని నిర్ణయించుకుంటే మేము అంగీకరించము” అని ఆయన నొక్కి చెప్పారు.
యశ్వంత్ సిన్హాను హైదరాబాద్కు స్వాగతించడంపై ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీ నడుచుకుంటామని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని గెలిపించకుండా ఉండేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిస్సందేహంగా యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.