Site icon HashtagU Telugu

Revanth Reddy: కార్యకర్తలకు ‘కాంగ్రెస్’ బీమా, ధీమా!

Revanth

Revanth

కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను కష్టకాలంలో ఆదుకోవాలన్న ఉద్ధేశంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రూ. 2 లక్షల ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేసింది. బుధవారం గాంధీ భవన్ లో మాణిక్యం  ఠాగూర్ తో కలిసి రేవంత్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పథకాన్ని సభ్యత్వ నమోదు సమయంలో ప్రారంభించామని, 45 లక్షల కార్యకర్తలకు ఈ పథకం వర్తిస్తోంది అని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను కష్టకాలంలో ఆదుకోవాలన్న ఉద్ధేశంతో ఈ పథకాన్ని ప్రారంభించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కార్యక్రమంలో భాగంగా తొమ్మిది మందికి చెక్కులను పంపిణీ చేసిన రేవంత్, మిగతావారికి ఇంటి వద్దకే చెక్కులను పంపిణీ చేయనున్నట్టు   తెలిపారు. రాష్ట్రంలో 90 రోజుల్లో 45లక్షల సభ్యత్వాలను నమోదు చేయించిన కార్యకర్తలకు ఆయన అభినందించారు. ఇప్పటివరకు 427 మంది సభ్యులు చనిపోయారని, వీరందరికి ప్రమాద బీమా అందిస్తున్నామని, 129 మంది ప్రమాద బీమాకు సంబంధించి ధ్రువపత్రాలు అందించినట్టు టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.