డ్రగ్స్ (Drugs ) విషయంలో సీఎం రేవంత్ (CM Revanth) సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్తో తెలంగాణలోకి ఎవరు ఎంటరైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే అని హెచ్చరించారు. ఈ మేరకు పోలీస్ అధికారులకు సైతం కీలక ఆదేశాలు జారీ చేయడం తో..ఎవర్ని వదిలిపెట్టడం లేదు. గత కొద్దీ రోజులుగా నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడగా..తాజాగా ఈరోజు నర్సింగ్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ ను పట్టుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
సోమవారం మధ్యాహ్నం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు సోదాలు చేశారు. పోలీసుల సోదాల్లో భాగంగా లావణ్య (Lavanya) వద్ద డ్రగ్స్ పట్టుబడ్డాయి. పట్టుబడిన యువతి లావణ్య తెలుగు హీరో ప్రియురాలిగా చెబుతున్నారు. పోలీసులు ఆ హీరో పేరు గోప్యంగా ఉంచారు. లావణ్య నుండి 4 గ్రాముల ఎండీఎంఏ మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో లావణ్యపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
కోకాపేటలోని ఓ అపార్ట్మెంటులో ఉంటున్న లావణ్య మ్యూజిషియన్గా పనిచేస్తున్నది. మూడు నెలల క్రితం వరలక్ష్మీ టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులో లావణ్య పేరు కూడా బయటకొచ్చింది. కానీ అప్పుడు దొరక్కుండా లావణ్య తప్పించుకుంది. దీంతో లావణ్యపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ తీసుకెళ్తుందనే పక్కా సమాచారంతో.. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగులో నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించాయి. ఇక ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి డ్రగ్స్ ఇచ్చినట్లుగా లావణ్య తెలిపింది. ప్రస్తుతం ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య మ్యూజిషియన్గా పనిచేస్తుండటంతో సినీ ఇండస్ట్రీలోనూ ఈమెకు పరిచయాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.
Read Also : AP : మరో బాంబ్ పేల్చిన షర్మిల..ఈసారి వైసీపీ నేతలు ఏమంటారో..?