Lok Sabha Elections : టైమ్స్ నౌ సర్వే.. కాంగ్రెస్‌కు 9 ఎంపీ స్థానాలు.. బీఆర్ఎస్, బీజేపీకి ఎన్నో తెలుసా ?

Lok Sabha Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అప్పటి వరకు చాలా స్ట్రాంగ్‌గా కనిపించిన బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. ఈనేపథ్యంలో రాబోయే లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు పెద్ద సవాల్‌గా మారాయి. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ ఎలాగైనా సాధ్యమైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెల్చుకోవాలనే పట్టుదలతో ఉంది. అత్యధిక ఎంపీ స్థానాలను గెల్చుకొని తెలంగాణ కాంగ్రెస్ సత్తాను పార్టీ అధిష్టానానికి తెలియజేయాలనే లక్ష్యంతో […]

Published By: HashtagU Telugu Desk
Lok Sabha Elections

Lok Sabha Elections

Lok Sabha Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అప్పటి వరకు చాలా స్ట్రాంగ్‌గా కనిపించిన బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. ఈనేపథ్యంలో రాబోయే లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు పెద్ద సవాల్‌గా మారాయి. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ ఎలాగైనా సాధ్యమైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెల్చుకోవాలనే పట్టుదలతో ఉంది. అత్యధిక ఎంపీ స్థానాలను గెల్చుకొని తెలంగాణ కాంగ్రెస్ సత్తాను పార్టీ అధిష్టానానికి తెలియజేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ ఉన్నారు. ఈనేపథ్యంలో తెలంగాణలో ఎంపీ ఎన్నికలపై ‘టైమ్స్ నౌ – మాట్రిజ్ ఎన్సీ సర్వే’ ఫలితాలు విడుదలయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join

సర్వే ఏం చెప్పింది ?

  • ‘టైమ్స్ నౌ – మాట్రిజ్ ఎన్సీ సర్వే’ నివేదిక ప్రకారం తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో(Lok Sabha Elections) 9 కాంగ్రెస్ పార్టీయే గెల్చుకునే అవకాశం ఉంది.
  • అనూహ్యంగా ఈసారి బీజేపీ 5 లోక్‌సభ స్థానాల్లో గెలుపు జెండా ఎగురవేస్తుందని సర్వే రిపోర్టు తెలిపింది.
  • కేసీఆర్ రాజకీయ పార్టీ బీఆర్ఎస్ 2 లోక్‌సభ స్థానాలకే పరిమితం అవుతుందని సర్వే నివేదిక పేర్కొనడం గమనార్హం.
  • ఎంఐఎం పార్టీ 1 స్థానానికి పరిమితం అవుతుందని నివేదిక తేల్చింది.
  • ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల వాటా విషయానికి వస్తే..  కాంగ్రెస్  పార్టీకి 40.4 శాతం, బీజేపీకి 22.6  శాతం, బీఆర్ఎస్ పార్టీకి 28.1 శాతం, ఎంఐఎం పార్టీకి 3.3 శాతం, ఇతర అభ్యర్థులకు 5.6 శాతం ఓట్లు వస్తాయని ‘టైమ్స్ నౌ – మాట్రిజ్ ఎన్సీ సర్వే’ పేర్కొంది.

Also Read : TDP – Rajya Sabha : ‘పెద్దల సభ’లో టీడీపీ నిల్.. 41 ఏళ్లలో ఇదే తొలిసారి

బీఆర్ఎస్‌పై గుర్రుగా ఉన్నవారంతా.. 

ఇప్పుడు అందరి దృష్టి లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పడింది. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహప్రతివ్యూహాలకు పదును పెట్టాయి. గెలుపు గుర్రాల కోసం అన్ని పార్టీలు అన్వేషణ స్టార్ట్ చేశాయి. అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీలోకి వలసలు స్టార్ట్ అయ్యాయి. బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్న నేతలంతా మెల్లగా ఆ పార్టీని వీడుతున్నారు.

Also Read : TSC​​SB : ఫేక్ వెబ్‌సైట్ల లింకులు వస్తున్నాయా ? 8712672222కు వాట్సాప్ చేయండి

  Last Updated: 12 Feb 2024, 11:13 AM IST