Tiger Dead: తెలంగాణలో మరణించిన పులికి విషప్రయోగం

తెలంగాణలోని పులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో ఓ పులి మరణం అధికారుల్ని విస్మయానికి గురి చేసింది.

Tiger Dead: తెలంగాణలోని పులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో ఓ పులి మరణం అధికారుల్ని విస్మయానికి గురి చేసింది. అయితే మృతి చెందిన మగపులి విషప్రయోగం వల్ల చనిపోయిందని అనుమానిస్తున్నట్లు అటవీ అధికారులు. చనిపోయిన పులి పరిసరాల్లో విషం ఎరగా వేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పైగా పరిసర ప్రాంతాల్లో ఆవు మృతదేహాన్ని కూడా అధికారులు గుర్తించారు.

మృతి చెందిన పులి కళేబరం మెడలో వల కూడా వదులుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాథమిక పరిశోధనలు మరియు పరిశీలనల ఆధారంగా విషప్రయోగం వల్ల మరణం సంభవించినట్లు బృందం అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులికి ఐదు లేదా ఆరు సంవత్సరాల వయస్సు ఉంటుందని వారు తెలిపారు. కాగజ్‌నగర్‌కు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని దారేగావ్‌లో పులి కళేబరం లభ్యమైందని అధికారిక ప్రకటన తెలిపింది.

ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (PCCF), తెలంగాణ RM డోబ్రియాల్ మరియు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) నియమించిన బృందం వెటర్నరీ సర్జన్‌లతో సహా అటవీ సిబ్బందితో స్థలాన్ని పరిశీలించింది. స్థానిక సిబ్బంది నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. ఫోరెన్సిక్ విచారణ కోసం నమూనాలను ప్రయోగశాలకు పంపినట్లు అధికారులు తెలిపారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పులి మృతి చెందడం ఇది రెండో కేసు. జనవరి 6న కవాల్ టైగర్ రిజర్వ్ టైగర్ కారిడార్‌లో అటవీ సిబ్బంది ఏడాదిన్నర వయసున్న పులి మృతదేహాన్ని కనుగొన్నారు.

Also Read: Ustad Rashid Khan: శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ మృతి