Three More Vande Bharat Trains: తెలంగాణకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు

ఇటీవలే సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ రైలు (Vande Bharat Train) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రైలుకు ప్రయాణికుల నుండి అనూహ్య రీతిలో ఆదరణ లభిస్తోంది. కాగా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

  • Written By:
  • Publish Date - January 22, 2023 / 01:35 PM IST

ఇటీవలే సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ రైలు (Vande Bharat Train) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రైలుకు ప్రయాణికుల నుండి అనూహ్య రీతిలో ఆదరణ లభిస్తోంది. కాగా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాచిగూడ- బెంగళూరు, సికింద్రాబాద్- తిరుపతి, సికింద్రాబాద్-పూణే మధ్య మూడు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మరో మూడు ఇలాంటి రైళ్లను త్వరలో ప్రారంభించాలని భారతీయ రైల్వే యోచిస్తోందని అధికారులు తెలిపారు.

అదనపు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాచిగూడ- బెంగళూరు, సికింద్రాబాద్- పూణే, సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడుస్తాయి. రైళ్లు గరిష్టంగా 130 kmph వేగంతో నడిచేలా దక్షిణ మధ్య రైల్వే (SCR) ఈ మార్గాల్లో తన రైలు నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసింది. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ డివిజన్లలో కనీసం ఒక ప్రధాన కోచ్ డిపోను ఏర్పాటు చేయాలని అధికారులు రైల్వే అధికారులకు సూచించారు. వందేభారత్ రైళ్ల నిర్వహణ కోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు డిపోలు అప్‌గ్రేడ్ చేయబడతాయి. వందేభారత్ రైళ్ల నిర్వహణ, ఇతర సంబంధిత కార్యకలాపాల కోసం రైల్వే డివిజన్‌లను వేగవంతం చేయాలని అధికారులు కోరారు.

Also Read: Rawalpindi Express: రావల్పిండి ఎక్స్‌ప్రెస్ నుంచి తప్పుకున్న అక్తర్.. కారణమిదే..?

భారతీయ రైల్వే ఈ ఏడాది చివరి నాటికి 75 వందేభారత్ రైళ్లను, రాబోయే మూడేళ్లలో 400 రైళ్లను నడపాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి నాగ్‌పూర్-బిలాస్‌పూర్, ఢిల్లీ-వారణాసి, గాంధీనగర్-ముంబై, చెన్నై-మైసూరుతో సహా వివిధ మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. 400 కొత్త తరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉందని సీనియర్ రైల్వే అధికారులు తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కింద చెన్నైలోని పెరంబూర్‌లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ద్వారా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రూపకల్పన తయారు చేయబడింది.

కాగా కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన సికింద్రాబాద్-వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. రైలు ప్రారంభించినప్పటి నుండి 100% ఆక్యుపెన్సీతో నడుస్తోందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య అందుబాటులో ఉన్న అనేక రైళ్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగవంతమైనది. రెండు నగరాల మధ్య దూరాన్ని ఎనిమిదిన్నర గంటలలోపు కవర్ చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే ఈ రైలు 700 కిలో మీటర్లు దూరం ప్రయాణించే మొదటి రైలు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ స్టేషన్లలో, తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.