Site icon HashtagU Telugu

TG IAS Officers : క్యాట్​ను ఆశ్రయించిన ఆమ్రపాలి సహా ముగ్గురు ఐఏఎస్‌లు

Telangana Ias Officers Cat

TG IAS Officers : ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, ఆమ్రపాలి, సృజన కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లోనే  రిపోర్ట్‌ చేయాలని  కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, ఆమ్రపాలి, సృజనలు వేర్వేరుగా క్యాట్‌‌లో పిటిషన్లు దాఖలు చేశారు. తాము తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, ఆమ్రపాలి క్యాట్‌ను(TG IAS Officers) కోరారు. ఏపీలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్‌ అధికారిణి సృజన క్యాట్‌ను కోరారు. ఈ పిటిషన్లపై క్యాట్ రేపు (మంగళవారం) విచారణ చేపట్టనుంది.

Also Read :Nobel Prize : ముగ్గురు ఆర్థికవేత్తలకు సంయుక్తంగా ఆర్థికశాస్త్ర నోబెల్ ప్రైజ్

Also Read :Twins Capital : ఈ పట్టణం.. కవలల ప్రపంచ రాజధాని.. ఎందుకు ?