10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు అవసరమైతే తప్ప ఆరుబయట వెళ్లకుండా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది. వ్యక్తులందరూ ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఫేస్ మాస్క్లు ధరించాలి. “20 నుండి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల్లో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రజలు వివిధ పనులకు వెళ్లేటప్పుడు, అవసరమైన కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఫేస్ మాస్క్లు ధరించాలని వెల్లడించింది.
తెలంగాణ పబ్లిక్ హెల్త్ (డిపిహెచ్) డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భారతదేశం అంతటా కోవిడ్ ఇన్ఫెక్షన్లు స్వల్పంగా పెరిగాయని చెప్పారు. “కోవిడ్ కేసులను సమర్థవంతంగా ఫేస్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రెండు డోస్లు తీసుకోవడం ద్వారా టీకాను పూర్తి చేయడం చాలా ముఖ్యం. కోవిడ్కు వ్యతిరేకంగా ఫేస్ మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను పాటించడం కూడా అంతే ముఖ్యం ”అని ఆయన అన్నారు.